News January 30, 2025
అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అనకాపల్లి పట్టణ పూడిమడక బస్ స్టాప్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. బుధవారం షేక్ సుభాన్ (60) ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు ముందు నుంచి నడిచి వెళుతున్నాడు. ఆ సమయంలోనే డ్రైవర్ గమనించకుండా బస్సును నడపడంతో సుభాన్ను ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 6, 2025
పల్నాడు: వైద్యాధికారుల నిర్లక్ష్యం.. ఆందోళనలో ప్రజలు

పల్నాడు జిల్లాలో వైద్యశాఖ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొండపాడు పీహెచ్సీలో టైమ్కు ముందే తాళాలు వేసిన ఘటన మరవకముందే, నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేగింది. ఓ మహిళకు సర్జరీ చేసిన వైద్యుడు ఆమె శరీరంలో బ్లేడ్ మర్చిపోయినట్లు బయటపడటంతో వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News December 6, 2025
పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దుల్లో నిన్న రాత్రి పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. స్పిన్ బోల్డక్ జిల్లాలో పాక్ దళాలు దాడులు ప్రారంభించాయని అఫ్గాన్ చెప్పింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా చమన్ సరిహద్దులో అఫ్గాన్ కాల్పులు జరిపిందని పాక్ ఆరోపించింది. 2 దేశాల మధ్య శాంతి చర్చలు పురోగతి లేకుండా ముగిసిన నేపథ్యంలో ఈ ఘటనలు జరగడం గమనార్హం.
News December 6, 2025
మహబూబాబాద్: మూడో విడతలో సర్పంచ్కు 1,185 నామినేషన్లు

మూడో విడత ఎన్నికల్లో డోర్నకల్, గంగారం కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్ మండలాల్లో 169 గ్రామ పంచాయతీల్లో 1,412 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 3వ రోజు నామినేషన్లు ముగిశాయి. సర్పంచ్కు 1,185, స్థానాలకు నామినేషన్లు, వార్డు స్థానాలకు 3,592 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉపసంహరణ, స్క్రూటీని అనంతరం ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి.


