News April 13, 2025

అనకాపల్లి: వచ్చే నెల 12నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సుజాత శనివారం తెలిపారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజులు చెల్లించాలన్నారు. ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని సూచించారు.

Similar News

News December 6, 2025

ప్చ్.. ప్రసిద్ధ్ కృష్ణ మళ్లీ..

image

రెండో వన్డేలో ధారాళంగా పరుగులిచ్చిన ప్రసిద్ధ్ కృష్ణను నేటి మూడో వన్డేకూ ఎంపిక చేయడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. తొలి వన్డేలో అతడు 8.2 ఓవర్లకు 85రన్స్ ఇచ్చాడు. నేటి మ్యాచులోనూ 2 ఓవర్లకే 27 రన్స్ సమర్పించుకున్నాడు. అతడు వేసిన 11వ ఓవర్‌లో డీకాక్ 2 సిక్సర్లు, ఒక ఫోర్ బాదారు. దీంతో షమీ లాంటి నాణ్యమైన బౌలర్లను వదిలేసి ఇలాంటి వారినెందుకు ఆడిస్తున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News December 6, 2025

రేపు రాత్రిలోపు రీఫండ్ చేయండి.. ఇండిగోకు కేంద్రం ఆదేశం

image

టికెట్లు రద్దయిన ప్రయాణికులందరికీ ఆలస్యం లేకుండా రీఫండ్‌ చేయాలని ఇండిగోను కేంద్ర విమానయాన సంస్థ ఆదేశించింది. అందుకు రేపు రాత్రి 8 గంటల వరకు గడువు విధించింది. ప్రయాణికులకు ఎలాంటి రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించవద్దని స్పష్టం చేసింది. రీఫండ్ ప్రాసెస్‌లో అలసత్వం వహిస్తే తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. అటు ఇవాళ కూడా ఇండిగోకు చెందిన వందల ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి.

News December 6, 2025

వడ్లమానులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

image

ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో గుర్తుతెలియని వృద్ధుని మృతదేహం శనివారం కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారంతో ఎస్సై శుభశేకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామంలోని ఓ ప్రైవేటు నర్సరీకి సమీపంలో గుర్తు తెలియని 65 ఏళ్ల వయోవృద్ధుడు మృతి చెంది ఉండడంతో వీఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.