News January 28, 2025
అనకాపల్లి విద్యార్థినులకు కరాటే, టైక్వాండో శిక్షణ

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిలకు కరాటే, టైక్వాండాలో శిక్షణ ఇవ్వనున్నట్లు అనకాపల్లి జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ జయప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వివిధ పాఠశాలల్లో చదువుతున్న 27,469 మంది విద్యార్థినులకు శిక్షణ ఇచ్చేందుకు శిక్షణ సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల శిక్షణ ఇచ్చే సంస్థలు ఈనెల 29 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News November 25, 2025
ధాన్యం కొనుగోలుపై ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని ప.గో జాయింట్ కలెక్టర్ రాహుల్ సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు, రవాణా, తూకంలో సమస్యలుంటే 81216 76653, 1800 425 1291 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. కొనుగోళ్లకు రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేశామని, రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
News November 25, 2025
జగిత్యాల: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ పెంపుపై కలెక్టర్ సమీక్ష

2025–26 ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ల పెంపుపై కలెక్టర్ బి.సత్యప్రసాద్ మంగళవారం సమావేశం నిర్వహించారు. 5–8 ప్రభుత్వ, 9–10 ప్రభుత్వ–ప్రైవేట్ పాఠశాలల SC విద్యార్థులు tgepass.cgg.gov.inలో దరఖాస్తు చేయాలని సూచించారు. ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలు, కుల–ఆదాయం సర్టిఫికెట్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఇన్ఆపరేటివ్ ఖాతాలున్న వారికి పోస్టల్ అకౌంట్లు తెరిపించి 100% రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.
News November 25, 2025
అండర్-19 క్రికెట్ పోటీల్లో పినపాక విద్యార్థిని సత్తా

సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఎస్.జీ.ఎఫ్ అండర్-19 రాష్ట్ర స్థాయి బాలికల క్రికెట్ పోటీల్లో పినపాక మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని వైష్ణవి రత్న ప్రతిభ కనబరిచింది. కరీంనగర్పై 17 బంతుల్లో 32 పరుగులు, వరంగల్పై 40 బంతుల్లో 46 పరుగులు చేసి, 2 వికెట్లు తీసింది. మహబూబ్నగర్పై కూడా 2 వికెట్లు సాధించి జట్టు విజయానికి కీలకంగా నిలిచింది. వైష్ణవికి పలువురు అభినందనలు తెలిపారు.


