News February 21, 2025

అనకాపల్లి: వైసీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

image

అనకాపల్లి జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షునిగా పి శివ సత్యనారాయణ (జోసఫ్), విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా బి హేమంత్ కుమార్‌ను నియమించింది. అలాగే జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కె సతీష్, జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలుగా బి అనురాధను నియమించింది.

Similar News

News December 4, 2025

సింగపూర్‌ లాంటి దేశాన్నీ ఇబ్బంది పెట్టారు: CM

image

AP: గత పాలకులు సింగపూర్‌ లాంటి దేశాన్ని, ఆ దేశ కంపెనీలను ఇబ్బంది పెట్టారని CM CBN విమర్శించారు. ‘ఆ బ్యాడ్ ఇమేజ్ చెరిపి బ్రాండ్ ఇమేజ్ తేవడంతో ఇపుడు పెట్టుబడులు వస్తున్నాయి. ఇటీవలి MOUలన్నీ 45 రోజుల్లో గ్రౌండ్ కావాలి. భూ సేకరణలో వివాదాలు రాకూడదు. భూములిచ్చిన వాళ్లు, తీసుకున్న వాళ్లు సంతోషంగా ఉండాలి’ అని అధికారులకు సూచించారు. UAE మాదిరి APలో ₹500 కోట్లతో సావరిన్ ఫండ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

News December 4, 2025

సాహిత్య భేరిలో భద్రాచలం విద్యార్థినికి ప్రశంసలు

image

భద్రాచలం విద్యార్థిని మడివి గురుత్వ సమందా సింగ్ కథా విభాగంలో ‘పేన్ పండుం అడివి రహస్యం’ కథ ఆకట్టుకుని, నిర్వాహకుల, వీక్షకుల ప్రసంశలు అందుకుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రపంచ సాహిత్య వేదిక ప్రతిష్టాత్మకంగా అంతర్జాలంలో ఏకధాటిగా 13 గంటల పాటు బాలసాహిత్య భేరి నిర్వహించింది. ఆదివాసీ వేషధారణలో పాల్గొని ప్రత్యేకంగా నిలిచారు. దాంతో గురువారం ఆమెను ఐటీడీఏ పీఓ రాహుల్ అభినందించారు.

News December 4, 2025

KMR: ప్రజల భద్రత, రక్షణ పోలీసుల ప్రధాన లక్ష్యం: DGP

image

ప్రజల భద్రత, రక్షణ పోలీసుల ప్రధాన లక్ష్యమని DGP శివధర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీసు అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణనే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమన్నారు. శాంతియుత, పారదర్శక గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేశామన్నారు. NZB, KMR జిల్లా పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించారు.