News February 21, 2025
అనకాపల్లి: వైసీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

అనకాపల్లి జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షునిగా పి శివ సత్యనారాయణ (జోసఫ్), విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా బి హేమంత్ కుమార్ను నియమించింది. అలాగే జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కె సతీష్, జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలుగా బి అనురాధను నియమించింది.
Similar News
News March 26, 2025
కొడాలి నానికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

AP: మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యపరీక్షల సమయంలో గుండెలోనూ సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు. దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
(Article being continuously updated..)
News March 26, 2025
MNCL: రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తుల స్వీకరణ

జిల్లాలో రాజీవ్ యువ వికాస పథకం ద్వారా వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పురుషోత్తం తెలిపారు. ఆర్థిక పురోగతి పెంపొందించేందుకు అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 5లోపు https:// tgobmmsnew. cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
News March 26, 2025
MDK: హామీలను అమలు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదు: హరీశ్ రావు

కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం మెదక్లో మాట్లాడుతూ.. రుణమాఫీ చేసిందని ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని, రుణమాఫీ కాని రైతులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు.