News March 18, 2024

అనకాపల్లి: సచివాలయ ఉద్యోగి మృతి.. రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా 

image

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ములకలపల్లిలో విద్యుత్ షాక్‌కి గురై మృతి చెందిన సచివాలయ ఉద్యోగి డి.చిరంజీవి కుటుంబానికి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చెక్కుని మృతుడి భార్య హేమలతకు దేవరాపల్లి హెచ్‌డీటీ డీ.ఆనంద్ రావు సోమవారం అందజేశారు. ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా కటౌట్లు తొలగిస్తూ విద్యుత్ షాక్‌తో చిరంజీవి ఆదివారం మృతి చెందాడు.

Similar News

News December 9, 2025

విశాఖలో 16 అనధికార, నిర్మాణ భవనాల తొలగింపు

image

జీవీఎంసీ కమీషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలో విశాఖలో ఆగస్టు 31 తర్వాత నిర్మించిన అనధికార భవనలను తొలగిస్తున్నట్ల జీవీఎంసీ ఛీప్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు తెలిపారు. జోన్-2లో 3, జోన్-3లో 2, జోన్-4లో 3, జోన్-5లో 4, జోన్-6లో 3, జోన్-8లో ఒక నిర్మాణంతో కలిపి మొత్తం 16 అనధికార నిర్మాణాలను రెండు రోజుల నుంచి తొలగించినట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన బీపీఎస్‌ను వినియోగించుకోవాలన్నారు.

News December 9, 2025

విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న CM

image

CM చంద్రబాబు ఈనెల 12న‌ విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. ముందుగా మధురవాడ ఐటీ సెజ్ హిల్-2లో ప్రముఖ IT కంపెనీ కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వీఈఆర్ సమావేశానికి హాజరై, వివిధ అభివృద్ధి అంశాలపై సమీక్ష చేస్తారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

News December 9, 2025

విశాఖలో టెట్ పరీక్షలు.. అభ్యర్థులకు డీఈవో కీలక సూచనలు

image

విశాఖ జిల్లాలో AP TET-2025 పరీక్షలు డిసెంబర్ 10 నుంచి 21 వరకు 12 కేంద్రాల్లో ఆన్‌లైన్ (CBT) విధానంలో జరగనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్పక తీసుకురావాలని, పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందే సెంటర్‌కు చేరుకోవాలని ఆయన సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని స్పష్టం చేశారు.