News February 18, 2025
అనకాపల్లి: సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలి

గంజాయి అక్రమ రవాణా వినియోగం, గుడ్ అండ్ బ్యాడ్ టచ్ మహిళలు బాలల హక్కులు, రోడ్డు భద్రత నియమాలు, సైబర్ నరాలపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రజల్లో అవగాహన కల్పించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. మంగళవారం అనకాపల్లిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా ద్వారా యువతను సరైన దిశలో నడిపించాలన్నారు.ఈ సమావేశంలో ఎస్.బీ డి.ఎస్.పి అప్పారావు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2025
ఆ సినిమాలో సమంత గెస్ట్ రోల్?

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరదా’ సినిమాలో సమంత గెస్ట్ రోల్లో నటించనున్నట్లు సమాచారం. క్లైమాక్స్లో ఆమె పాత్ర ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో సమంత, అనుపమ కలిసి ‘అ ఆ’లో నటించారు. ‘పరదా’ సినిమాకు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సినిమాతో పాటు ‘రక్త బ్రహ్మాండ్’ సిరీస్లో నటిస్తున్నారు.
News March 13, 2025
కడపలో చదువుల తల్లి ఇక లేదు

కడపలో బుధవారం హృదయాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. కడపకు చెందిన ఆయేషా ఇంటర్మీడియట్ సెకెండ్ ఇయర్ చదువుతోంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో బుధవారం ఫిజిక్స్ రాస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే సిబ్బంది దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. ఆయేషా పదో తరగతిలో 592, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 425 మార్కులు సాధించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు.
News March 13, 2025
NZB: మార్కెట్ యార్డుకు 3 రోజులు సెలవులు

నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్కు వరుస సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. 14న హోలీ, 15న దల్హండి, 16న ఆదివారం కావడంతో మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవన్నారు. దీనిని గమనించి రైతులు పంట దిగుబడులను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని సూచించారు. 17తేదీ నుంచి యథావిధిగా మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు కొనసాగుతాయని తెలిపారు.