News March 16, 2025

అనకాపల్లి: 10వ తరగతి పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సున్నితమైన పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. పరీక్ష కేంద్రాల ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించమన్నారు.

Similar News

News December 6, 2025

గ్రీవ్స్ డబుల్ సెంచరీ.. NZ-WI తొలి టెస్టు డ్రా

image

న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. 531 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 72కే 4 వికెట్లు పడినా జస్టిన్ గ్రీవ్స్(202*) అద్భుత పోరాటం చేశారు. షాయ్ హోప్(140), కీమర్ రోచ్‌(58*)తో కలిసి న్యూజిలాండ్‌కు చుక్కలు చూపెట్టారు. దాదాపు గెలిపించినంత పని చేశారు. కానీ 5వ రోజు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. స్కోర్లు: ఫస్ట్ ఇన్నింగ్స్: NZ-231/10, WI-167/10, సెకండ్ ఇన్నింగ్స్: NZ-466/8D, 457/6.

News December 6, 2025

Meesho: ప్రయత్నిస్తే ఫలితం ఇలా ఉంటుంది..

image

IIT గ్రాడ్యుయేట్లు విదిత్ ఆత్రేయ, సంజీవ్ బర్న్వాల్ 2015లో ఓ ప్రయోగంలా ప్రారంభించిన స్టార్టప్ ‘మీషో’. చిన్న వ్యాపారులకు వేదికగా నిలిచింది. ధరలు తక్కువ కావడటంతో సేల్స్ పెరిగాయి. ఐదేళ్లలో కంపెనీ వేగంగా వృద్ధి చెందింది. 2025 FYలో ₹9,390 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇప్పుడు ₹5,421 కోట్ల IPOతో స్టాక్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీకి మీషో సిద్ధమవుతోంది. ప్రయత్నిస్తే ఫలితం ఇలా ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.

News December 6, 2025

బిల్వ స్వర్గం గుహల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్.!

image

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని కనుమకింది కొట్టాల గ్రామ సమీపాన ఉన్న బిళ్ళస్వర్గం గుహల వద్ద సినిమా షూటింగ్ సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా యూనిట్ బృందం గుహల సన్నివేశాల చిత్రీకరణ కోసం వచ్చింది. దీంతో ఈ సందర్భంగా సినిమా యూనిట్ బృందం తరలిరావడంతో గుహల్లో సందడి వాతావరణం నెలకొంది.