News April 13, 2025
అనకాపల్లి: 14న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 14న రద్దు చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Similar News
News February 18, 2026
వరంగల్ నుంచి ఆకాశంలోకి రాకెట్!

వరంగల్ చరిత్రలో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఇస్రో సేఫ్ ట్యూటర్ ATDRL, స్పేస్ రీసెర్చ్ ల్యాబ్ ఆధ్వర్యంలో<<19166535>> రుద్రమ V.01 మోడల్<<>> రాకెట్ను ఈనెల 28న లాంచ్ చేయనున్నారు. భూమి పైనుంచి 3వేల అడుగుల ఎత్తు వరకు వెళ్లి, ప్యారాచూట్ ద్వారా కిందకు చేరుకుంటుంది. కాళోజీ కళాక్షేత్రంలో అదేరోజు మ.2-5వరకు ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశం జరగనుంది. WGLకు చెందిన శశాంక్ సొంత కంపెనీ ద్వారా దీనికి శ్రీకారం చుట్టడం విశేషం.
News February 18, 2026
RJY: టెన్త్ పరీక్షలు రాయబోతున్నారా? ఈ వివరాలు మీ కోసమే!

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే టెన్త్ పరీక్షలకు 24,538 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు డీఈవో కె. వాసుదేవరావు ప్రకటించారు. అందులో 12,555 మంది బాలురు, 11,983 మంది బాలికలు పరీక్షలకు సన్నద్ధంగా ఉన్నారన్నారు. టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
News February 18, 2026
మార్కుల్లో తేడా వస్తే టీచర్కు ఫైన్!

AP: పదో తరగతి మూల్యాంకనంలో పొరపాట్లు జరగకుండా విద్యాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. రీకౌంటింగ్లో 5 కంటే ఎక్కువ మార్కుల తేడా వస్తే మూల్యాంకనం చేసిన టీచర్కు రూ.1500 నుంచి రూ.4000 వరకు ఫైన్ విధించనుంది. ఒక పేపర్ను తప్పకుండా 12 నిమిషాలు దిద్దాలనే నిబంధన పకడ్బందీగా అమలు చేయనుంది. గతేడాది వ్యాల్యూయేషన్లో భారీగా తప్పులు దొర్లడం, ఓ స్టూడెంట్కు ఏకంగా 30 మార్కులు తక్కువ వేయడం పెద్ద వివాదమైంది.


