News March 26, 2025

అనకాపల్లి: 208 మంది విద్యార్థులు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన పదవ తరగతి ఫిజికల్ సైన్స్ పరీక్షకు 208 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది హాజరు కావాల్సి ఉండగా 20,673 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 766 మంది హాజరు కావలసి ఉండగా 659 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News October 15, 2025

IPS పూరన్ సూసైడ్: ట్విస్టులెన్నో.. (1/2)

image

TGకి చెందిన హరియాణా IPS అధికారి <<18001541>>పూరన్<<>> సూసైడ్ వెనుక ఎన్నో ట్విస్టులు. IT కథనం ప్రకారం.. రోహతక్ IGగా ఉన్న పూరన్‌ను PTCకి బదిలీ చేశారు. దీంతో సెలవు పెట్టి PSO సుశీల్‌తో కలిసి చండీగఢ్‌కు బయలుదేరారు. మధ్యలో ASI సందీప్ టీమ్ ఆ కారును ఆపి సుశీల్‌ను అదుపులోకి తీసుకుంది. ‘తర్వాత నీ వంతే’ అని పూరన్‌ను బెదిరించారు. ఆయనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ కోసం సుశీల్‌పై ఒత్తిడి చేసి వారం తర్వాత ACB కేసుపెట్టింది.

News October 15, 2025

IPS పూరన్ కుమార్ సూసైడ్ కేసులో ట్విస్టులెన్నో.. (2/2)

image

వీటిపై పూరన్ DGP, SPకి కాల్ చేసినా స్పందన లేదు. తర్వాత ఆయన సూసైడ్ చేసుకోగా భార్య కేసు పెట్టారు. మృతికి కులవివక్ష కారణమన్న విమర్శలు రేగడంతో DGP, SPని మార్చారు. ఈక్రమంలో పూరన్ అవినీతిపరుడని వీడియో తీసి ASI సందీప్ మరణించడం కలకలం రేపింది. గ్యాంగ్‌స్టర్ ఇందర్జిత్‌‌తో పూరన్‌కు ఆర్థిక ఒప్పందాలున్నట్లు అతడు ఆరోపించాడు. కులవివక్ష అంశంగా ఉన్న కేసు ఇప్పుడు అవినీతి, పోలీసులు-నేరగాళ్ల బంధం దిశగా మళ్లింది.

News October 15, 2025

సూర్యాపేట: ‘బ్యాంకర్లు ఇచ్చిన లక్ష్యాలను సాధించాలి’

image

బ్యాంకర్లు ఇచ్చిన లక్ష్యాలను సాధించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందాలలాల్ పవార్ సూచించారు. త్రైమాసిక సమీక్షలో భాగంగా జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో RBI LDO గోమతి, NABARD జిల్లా మేనేజర్ మురళి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట నాగ ప్రసాద్, నాబార్డ్ జిల్లా మేనేజర్ మురళీ పాల్గొన్నారు.