News April 4, 2025

అనకాపల్లి: 3 చోట్ల టెన్త్ పరీక్షా పేపర్ల మూల్యాంకనం

image

అనకాపల్లి జిల్లాలో పదవ తరగతి మూల్యాంకనం ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు తెలిపారు. అనకాపల్లి పట్టణంలో వేల్పుల వీధి టౌన్ బాలికోన్నత పాఠశాల, గవరపాలెం చిన్న హైస్కూల్, ఏఎంఎల్ హైస్కూల్లో మూల్యాంకనం జరుగుతున్నట్లు తెలిపారు. మూల్యాంకనం జరిగే స్కూల్స్ వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News November 22, 2025

NGKL: ఎమ్మెల్యే వంశీకృష్ణకు మరోసారి డీసీసీ అధ్యక్ష పదవి

image

నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణకు కాంగ్రెస్ అధిష్ఠానం మరోసారి అవకాశం కల్పించింది. ఇప్పటివరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా డీసీసీల ఎంపికలో భాగంగా తిరిగి అవకాశం లభించింది. ఇటీవల పీసీసీ ఉపాధ్యక్షుడిగానూ రాష్ట్రస్థాయిలో అవకాశం కల్పించిన అధిష్ఠానానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

News November 22, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్‌ను నియమిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. పలువురు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

News November 22, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్‌ను నియమిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. పలువురు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.