News March 12, 2025

అనకాపల్లి: 325 మంది విద్యార్థులు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షకు 325 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్ బి.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 10,136 మంది హాజరుకావాల్సి ఉండగా 9,905 మంది హాజరైనట్లు తెలిపారు. వోకేషనల్ కోర్సుకు సంబంధించి 2,345 మంది హాజరు కావలసి ఉండటం 2,251 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News March 7, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన NZB కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని మహిళలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు.
మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుకుంటూ దేశ అభివృద్ధికి కీలకంగా మారుతున్నారన్నారు. మహిళలకు భద్రత, గౌరవం, సమాన అవకాశాలు కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ గుర్తు చేశారు.

News March 7, 2026

ప్రగతి ప్రణాళికలో వైద్య సేవలను బలోపేతం చేయాలి: కలెక్టర్

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో భద్రాద్రి కలెక్టర్ అంకిత్ కలిసి వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు మొత్తం 99 రోజులపాటు చేపట్టనున్న కార్యాచరణపై కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.

News March 7, 2026

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ: డీఐజీ

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జనవరి 1 నుంచి ఈనెల 6 వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఓవర్ స్పీడ్ 1,763 కేసులు, హెల్మెట్ లేకుండా 1,590, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 421, డ్రంక్ అండ్ డ్రైవింగ్ 1,538, ఓపెన్ డ్రింకింగ్ కేసులు 2,928 నమోదు చేసినట్లు తెలిపారు.