News March 15, 2025

అనకాపల్లి: 331 మంది విద్యార్థులు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 331 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 9,720 మంది హాజరు కావాల్సి ఉండగా 9,505 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 1,932 మంది హాజరుకావాల్సి ఉండగా 1,816 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News November 2, 2025

HYDకు మెస్సీ.. వారంలో బుకింగ్స్

image

ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ డిసెంబర్‌లో హైదరాబాద్‌కు రానున్నారు. కేరళ ప్రోగ్రామ్ రద్దవడంతో HYDను చేర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గచ్చిబౌలి/రాజీవ్ గాంధీ స్టేడియంలో వేదిక ఉంటుందని, వారంలో బుకింగ్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. GOAT Cupలో భాగంగా డిసెంబర్ 12/13 తేదీల్లో మెస్సీ కోల్‌కతా చేరుకుంటారు. అదే రోజు HYD, 14న ముంబై, 15న ఢిల్లీలో సెలెబ్రిటీలతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడతారు.

News November 2, 2025

క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి కొండపల్లి

image

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరి కొంతమంది తీవ్ర గాయాలు పాలై పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతుందని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

News November 2, 2025

KNR: పీఎఫ్‌, డిపాజిట్లపై అవగాహన ముఖ్యం: కమిషనర్

image

క్లెయిమ్ చేయని డిపాజిట్లు, బీమా, పీఎఫ్‌ వంటి అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ బ్యాంకు, బీమా సంస్థల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ కేవైసీ, ఫోన్ నంబర్, అడ్రస్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. ముందు చూపుతో వ్యవహరిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు.