News March 15, 2025

అనకాపల్లి: 331 మంది విద్యార్థులు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 331 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 9,720 మంది హాజరు కావాల్సి ఉండగా 9,505 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 1,932 మంది హాజరుకావాల్సి ఉండగా 1,816 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News November 27, 2025

చెప్పులు, చెత్త డబ్బా.. ‘సర్పంచ్’ గుర్తులివే..

image

TG: సర్పంచ్ అభ్యర్థులకు SEC 30గుర్తులు కేటాయించింది. వీటిలో చెప్పులు, చెత్తడబ్బా, బిస్కెట్, బెండకాయ, రింగు, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్, లేడీస్ పర్స్, రిమోట్, టూత్ పేస్ట్, బ్లాక్ బోర్డు, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జాలి, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్‌మెన్, పడవ, ఫ్లూట్, చైన్, బెలూన్, స్టంప్స్, స్పానర్ గుర్తులున్నాయి. వార్డు అభ్యర్థులకు 20గుర్తులిచ్చింది.

News November 27, 2025

3,445 ప్రభుత్వ ఉద్యోగాలు.. BIG UPDATE

image

NTPC అండర్ గ్రాడ్యుయేట్-2024 CBT-II షెడ్యూల్‌ను RRB విడుదల చేసింది. DEC 20న ఈ పరీక్షను నిర్వహిస్తామని తెలిపింది. ఎగ్జామ్‌కు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను రిలీజ్ చేస్తామంది. గత ఏడాది 3,445 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన CBT-1 ఫలితాల్లో తదుపరి దశకు 51,979 మంది అర్హత సాధించారు.

News November 27, 2025

ములుగు జిల్లాలో నేడే నామినేషన్ల స్వీకరణ

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ఎన్నికలకు నేడు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందులో భాగంగా ములుగు జిల్లాలోని మూడు మండలాల్లో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. గోవిందరావుపేట 18 జీపీలు, తాడ్వాయి 18 జీపీలు, ఏటూరునాగారం 12 జీపీలు, మొత్తం 48 సర్పంచ్, 420 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.