News March 15, 2025

అనకాపల్లి: 331 మంది విద్యార్థులు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 331 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 9,720 మంది హాజరు కావాల్సి ఉండగా 9,505 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 1,932 మంది హాజరుకావాల్సి ఉండగా 1,816 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News April 21, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* AP: తెలుగు ప్రజలకు రుణపడి ఉంటా: CBN
* ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
* TG: త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టులకు నోటిఫికేషన్: మంత్రి
* ఎంఐఎం నేతలు విషసర్పాల కంటే ప్రమాదం: బండి
* BRS ఓటమి తెలంగాణకే నష్టం: కేటీఆర్
* IPL: పంజాబ్‌పై ఆర్సీబీ విజయం

News April 21, 2025

కొల్హాపూర్, కామాఖ్యలో ఆలయాలను దర్శించుకున్న సూర్య దంపతులు

image

తమిళ నటుడు సూర్య తన భార్య జ్యోతికతో కలిసి పుణ్యక్షేత్రాల్ని దర్శించుకుంటున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ మహాలక్ష్మి, అస్సాంలోని కామాఖ్య ఆలయాల్లోని శక్తిపీఠాలను తాజాగా దర్శనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను వారు సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. కాగా.. సూర్య నటించిన రెట్రో వచ్చే నెల 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News April 21, 2025

భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్.. కట్ చేస్తే..

image

UPలోని అలీగఢ్‌కు చెందిన షకీర్(40) అనే వ్యక్తి తన భార్య అంజుమ్, నలుగురు పిల్లలు ఈ నెల 15 నుంచి కనిపించడం లేదంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకూ వారి ఆచూకీ లభించలేదు. తాజాగా షకీర్ బంధువులకు ఆమె తాజ్‌మహల్ వద్ద మరో వ్యక్తితో కలిసి కనిపించింది. వారు వాట్సాప్‌లో వీడియో పంపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి తెలిసినవాడేనని, తన భార్యను తన వద్దకు చేర్చాలని షకీర్ అధికారుల్ని కోరాడు.

error: Content is protected !!