News December 16, 2024

అనపర్తిలో రైలు ఢీకొని యువకుడు మృతి

image

అనపర్తిలో రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు..అనపర్తికి చెందిన కే. పవన్ (25) ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం పని నిమిత్తం ఇంటి నుంచి రెస్టారెంట్‌కి బయలుదేరాడు. మార్గమధ్యలో రైలు పట్టాలు దాటుతుండగా వైజాగ్ వైపు వెళ్తున్న రైలు అతన్ని ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 17, 2025

తూ.గో: ‘జిల్లాలో ధాన్యం సేకరణ విజయవంతం’

image

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్‌లో ధాన్యం సేకరణ విజయవంతంగా కొనసాగుతోందని జేసీ వై. మేఘ స్వరూప్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా డిసెంబర్ 16, 2025 నాటికి జిల్లాలో 42,977 మంది రైతుల నుంచి రూ. 770.74 కోట్ల విలువ చేసే 3,25,345 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటివరకు 37,308 మంది రైతులకు రూ. 659.76 కోట్లను చెల్లించినట్లు ఆయన వివరించారు.

News December 17, 2025

తూ.గో: ‘జిల్లాలో ధాన్యం సేకరణ విజయవంతం’

image

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్‌లో ధాన్యం సేకరణ విజయవంతంగా కొనసాగుతోందని జేసీ వై. మేఘ స్వరూప్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా డిసెంబర్ 16, 2025 నాటికి జిల్లాలో 42,977 మంది రైతుల నుంచి రూ. 770.74 కోట్ల విలువ చేసే 3,25,345 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటివరకు 37,308 మంది రైతులకు రూ. 659.76 కోట్లను చెల్లించినట్లు ఆయన వివరించారు.

News December 16, 2025

తూ.గో: TDP జిల్లా అధ్యక్షుడిగా బొడ్డు వెంకట రమణ చౌదరి?

image

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాజానగరం నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి, ప్రస్తుత ‘రుడా’ అధ్యక్షుడు బొడ్డు వెంకట రమణ చౌదరి పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఏడు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పదవిని ఆయనకు అధిష్ఠానం కేటాయించింది. రాజానగరం స్థానం జనసేనకు కేటాయించడంతో, రమణ చౌదరి ఈ పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. వెంకట రమణ చౌదరి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు.