News April 18, 2024
అనాధ బాలికలు దరఖాస్తుల ఆహ్వానం

దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళ టెక్నికల్ శిక్షణా సంస్థ HYD, పాలిటెక్నిక్ డిప్లమో కోర్సులకు 2024-25 విద్యాసంవత్సరానికి జనగామ జిల్లాలోని అనాథ బాలికలు, పేదరికంలో ఉన్న బాలికలు పదవ తరగతి పూర్తి చేసిన బాలికలకు అర్హత పరీక్ష లేకుండా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. మే 15లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Similar News
News December 5, 2025
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: రాణి కుముదిని

సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.
News December 5, 2025
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: రాణి కుముదిని

సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.
News December 4, 2025
వరంగల్: రిజర్వ్ స్టాఫ్తో ర్యాండమైజేషన్

జీపీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ను జిల్లా పరిశీలకులు బాల మాయాదేవి, కలెక్టర్ సత్య శారదలు కలెక్టరేట్ వీసీ హాల్లో నిర్వహించారు. వరంగల్, నర్సంపేట డివిజన్ల మండలాల వారీగా సర్పంచ్, వార్డు స్థానాలకు ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోల కేటాయింపులు పూర్తయ్యాయి. స్థానికేతర సిబ్బందిని ప్రాధాన్యంగా ఎంపిక చేస్తూ, 91 పంచాయతీలకు 20% రిజర్వ్ స్టాఫ్తో ర్యాండమైజేషన్ జరిపారు.


