News March 25, 2024

అనిల్… ఆ సెంటిమెంట్ ను కొనసాగించేనా?

image

నెల్లూరు నేతలు ఎక్కడైనా నెగ్గుకొస్తారనే పేరుంది. గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నరసారావుపేట, విశాఖ, బాపట్ల MPగా, మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒంగోలు, నరసారావుపేట MPగా, పనబాక లక్ష్మి బాపట్ల MPగా విజయం సాధించారు. ఒంగోలు ఎంపీగా గతంలో బెజవాడ పాపిరెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మ, ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఈఎన్నికల్లో నరసారావుపేట నుంచి పోటీ చేస్తున్న అనిల్ అదృష్టం ఎలా ఉందో.

Similar News

News December 1, 2025

వేమిరెడ్డి గారూ.. వీటి గురించి మాట్లాడండి!

image

నెల్లూరు జిల్లాలో నాట్లు మొదలయ్యాయి. 6లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. ప్రభుత్వం ఎకరాకు 3బస్తాల యూరియానే ఇస్తానంటోంది. ఇటీవల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రోడ్లు విస్తరించాల్సిన అవసరం ఉంది. రైల్వే లైన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాల్సి ఉంది. గంజాయి నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వీటిపై MP వేమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఉంది.

News December 1, 2025

వేమిరెడ్డి గారూ.. వీటి గురించి మాట్లాడండి!

image

నెల్లూరు జిల్లాలో నాట్లు మొదలయ్యాయి. 6లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. ప్రభుత్వం ఎకరాకు 3బస్తాల యూరియానే ఇస్తానంటోంది. ఇటీవల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రోడ్లు విస్తరించాల్సిన అవసరం ఉంది. రైల్వే లైన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాల్సి ఉంది. గంజాయి నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వీటిపై MP వేమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఉంది.

News December 1, 2025

జగన్ పర్యటనకు గంజాయి బ్యాచ్‌ని తెచ్చారు: కోటంరెడ్డి

image

ఇటీవల జగన్ నెల్లూరుకు వచ్చినప్పుడు కామాక్షమ్మ వందలాది మంది గంజాయి బ్యాచ్‌ని తీసుకువచ్చింది నిజమా? కాదా? అని నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ‘పెంచలయ్య మరణానికి నేను, నా తమ్ముడు, కార్పొరేటర్ శ్రీనివాసులు కారణమని సీపీఎం చెబితే ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా. కామాక్షమ్మ నుంచి ఆనం విజయకుమార్ రెడ్డి రూ.5లక్షలు తీసుకున్నారనే ప్రచారం ఉంది’ అని ఆయన చెప్పారు.