News March 3, 2025

అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP

image

అనుమానాస్పద కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. ఏటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డులు బ్లాక్ అయ్యాయని, మీ అమౌంట్ రెట్టింపు చేస్తామని వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్డు వివరాలతోపాటు సీవీవీ, ఓటీపీ సమాచారం చెప్పవద్దని అన్నారు. సైబర్ మోసానికి గురి అయితే 1930 నంబర్‌కు లేదా, సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News November 12, 2025

రేపు జిల్లా వ్యాప్తంగా 19,678 గృహ ప్రవేశాలు

image

జిల్లాలో PMAY కింద పూర్తి చేసిన 19,678 గృహాల ప్రవేశం బుధవారం జరగనుంది. అధికారులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తిచేశారు.అదే విధంగా PMAY కింద 2.0 పథకం కింద మరో 2,838 మందికి గృహాలను మంజూరు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈనెల 30వ తేదీ వరకు ఆవాస్ ప్లస్-2024 సర్వేలో భాగంగా గ్రామీణ యాప్ ద్వారా లబ్ధిదారుల నమోదు జరుగనుంది.

News November 11, 2025

18న రాష్ట్రపతి నుంచి అవార్డ్ అందుకోనున్న కలెక్టర్

image

నీటి సంరక్షణ కార్యక్రమాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన నెల్లూరు జిల్లాకు దేశ స్థాయిలో ‘జల్ సంచయ్ జన్ భగీధారి 1.0’ నేషనల్ అవార్డు లభించింది. నవంబర్ 18న న్యూఢిల్లీలో ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులు మీదుగా కలెక్టర్ హిమాన్షు శుక్లా అందుకోనున్నారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ గంగాభవాని కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు,

News November 11, 2025

నెల్లూరు కలెక్టరేట్‌లో మౌలానాకు నివాళి

image

నెల్లూరు కలెక్టరేట్‌లో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవం జరిగింది. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ హిమాన్షు శుక్లా నివాళి అర్పించారు. దేశంలో విద్యావ్యవస్థకు సంస్కరణలతో అబుల్ కలామ్ బాటలు వేశారని తెలిపారు.