News March 20, 2024
అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలపై నిఘా ఉంచండి: కృష్ణా కలెక్టర్

ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకుల్లో జరిపే లావాదేవీల వివరాలను అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ జిల్లాలో కోడ్ అమలులో ఉందన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచి వాటి వివరాలను పంపాలన్నారు. ఒక బ్యాంక్ ఖాతా నుంచి ఎక్కువ మందికి సొమ్ము జమ అవుతుంటే ఆ వివరాలను తెలియజేయాలన్నారు.
Similar News
News April 15, 2025
నేటి నుంచి సముద్రంలో వేట నిషేధం.!

నేటి నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని కోడూరు మండల ఎఫ్డీఓ డి. స్వామివారి రావు ఒక ప్రకటనలో తెలిపారు. 15వ తేది నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు యాంత్రిక ఇంజిన్ నావలలో వేట చేయుట నిషేధించినట్లు చెప్పారు. కోడూరు మండలం పాలకాయతిప్ప లాండింగ్ సెంటర్లోని మర పడవల యజమానులు, షరతులు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు బోటు లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.
News April 15, 2025
నేడు విచారణకు రానున్న వంశీ బెయిల్ పిటిషన్

గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. విజయవాడ SC, ST కోర్టు న్యాయ అధికారి హిమబిందు గత శుక్రవారం ఈ పిటిషన్ విచారించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా సత్యవర్ధన్ అనే యువకుడిని అపహరించిన కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం విధితమే.
News April 15, 2025
కృష్ణా: మచిలీపట్నంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

పేదలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో మొత్తం 19 మందికి రూ.16.68లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.