News April 4, 2025
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం హబ్షీపూర్లో జరిగింది. ఎస్ఐ గంగరాజు వివరాల ప్రకారం.. హబ్షీపూర్కి చెందిన కొక్కడగల్ల భాగ్యమ్మ (45) కూర్చున్న చోటే మృతి చెందిందని ఆమె కుమారులు ఫిర్యాదు చేశారు. కుమారులు సురేశ్, సమేల్ ఫిర్యాదు మేరకు కేసు నమెాదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News April 19, 2025
ఖమ్మం: డిగ్రీ విద్యార్థులలో అయోమయం

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు సోమవారం నుంచి 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ యూనివర్సిటీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు హాల్ టికెట్లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలు కొనసాగుతాయా? వాయిదా పడతాయా? యూనివర్సిటీ అధికారులు తెలపకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News April 19, 2025
OTTలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్.. ఈ వీకెండ్ చూసేయండి..

*Officer On Duty- Netflix: తాకట్టులో పెట్టిన దొంగ బంగారంతో కథ మొదలవుతుంది. కుంచాకో బోబన్ దర్యాప్తు.. ఒక సీరియల్ కిల్లర్ గ్యాంగ్ దగ్గరకు చేరుతుంది. ఇన్టెన్స్, యాక్షన్, ఎమోషన్తో సాగే ఒక బెస్ట్ క్రైమ్ డ్రామా.
*Dahaad(సిరీస్)- Prime: మిస్సైన అమ్మాయిలు పబ్లిక్ టాయిలెట్లో శవాలుగా దొరుకుతుంటారు. ఈ మిస్టరీ ఛేదించేందుకు సోనాక్షి యాక్షన్లోకి దిగుతుంది. పోలీసులతో కిల్లర్ ఆడే మైండ్ గేమ్ కట్టిపడేస్తుంది.
News April 19, 2025
RCBకి చిన్నస్వామి స్టేడియమే శాపమా?

18 ఏళ్లుగా IPL టైటిల్ కొట్టాలనే RCB కలలపై సొంత గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం నీళ్లు చల్లుతోంది. బయటి మైదానాల్లో గెలుస్తున్న RCB ఇక్కడ మాత్రం చేతులెత్తేస్తోంది. ఈ స్టేడియం చిన్నగా ఉండటం సొంత జట్టుకన్నా ప్రత్యర్థులకే ఎక్కువగా ఉపయోగపడుతోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత WPL, IPLలో కలిపి ఇక్కడ 7 మ్యాచులు వరుసగా ఓడడంతో ఈ మైదానం RCBకి అచ్చిరావడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు.