News December 11, 2024

అన్నదాతకు అండగా ఉద్యమిస్తాం: కాటసాని

image

అన్నదాతలకు అండగా నిలబడి ఉద్యమిస్తామని వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలులోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ డిసెంబరు 13న రైతుల కోసం.. రైతులతో కలిసి నంద్యాలలోని ఉదయానంద హోటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం దగా చేసిందన్నారు.

Similar News

News January 7, 2026

రాయలసీమ పారిశ్రామికాభివృద్ధి బ్లూప్రింట్

image

రాయలసీమలోని అన్ని జిల్లాలు సమానంగా వృద్ధి చెందేలా సమగ్ర పారిశ్రామిక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను బట్టి ప్రత్యేక పారిశ్రామిక హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి పెరగడమే కాకుండా ప్రాంతీయ అసమానతలు తొలగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పారిశ్రామిక ప్రాధాన్యతలు పై ఫొటోలో చూడొచ్చు. ఈ ప్రణాళిక సాకారం అయితే రాయలసీమ రతనాల సీమ కానుంది.

News January 6, 2026

రాయలసీమ పారిశ్రామికాభివృద్ధి బ్లూప్రింట్

image

రాయలసీమలోని అన్ని జిల్లాలు సమానంగా వృద్ధి చెందేలా సమగ్ర పారిశ్రామిక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లాలో ఉన్న వనరులు, అవకాశాలను బట్టి ప్రత్యేక పారిశ్రామిక హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి పెరగడమే కాకుండా ప్రాంతీయ అసమానతలు తొలగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా పారిశ్రామిక ప్రాధాన్యతలు పై ఫొటోలో చూడొచ్చు. ఈ ప్రణాళిక సాకారం అయితే రాయలసీమ రతనాల సీమ కానుంది.

News January 6, 2026

కర్నూలు: ‘సంక్షేమ వసతి గృహాలు మెరుగ్గా పనిచేయాలి’

image

సంక్షేమ వసతి గృహాలు మెరుగ్గా పనిచేయాలని రాష్ట్ర BC వెల్ఫేర్ ఎక్స్‌-అఫీషియో కార్యదర్శి సత్యనారాయణ ఆదేశించారు. కర్నూలులోని సునయన ఆడిటోరియంలో మంగళవారం కర్నూలు, కడప, అనంతపురం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు.