News October 8, 2024
అన్నమయ్య: ‘అర్జీదారుల సమస్యలకు పరిష్కారం చూపాలి’
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాక బాధ్యతగా పనిచేయవలసిన అవసరం అధికారులపై ఉందని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో జిల్లా అధికారులకు అందించారు.
Similar News
News October 7, 2024
టీడీపీలో చేరిన కమలాపురం పంచాయతీ ఛైర్మన్
కమలాపురం నగర పంచాయతీ ఛైర్మన్ సోమవారం సాయంత్రం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఛైర్మన్ మార్పూరు మేరీతోపాటు మరికొందరు కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కమలాపురం నగర పంచాయతీ అభివృద్ధి కోసమే తను టీడీపీలో చేరుతున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.
News October 7, 2024
టీడీపీలో చేరిన కమలాపురం పంచాయతీ ఛైర్మన్
కమలాపురం నగర పంచాయతీ ఛైర్మన్ సోమవారం సాయంత్రం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఛైర్మన్ మార్పూరు మేరీతోపాటు మరికొందరు కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కమలాపురం నగర పంచాయతీ అభివృద్ధి కోసమే తను టీడీపీలో చేరుతున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.
News October 7, 2024
YVU బీటెక్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల
కడప YVU, ప్రొద్దుటూరు YSR ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ 2,4 సెమిస్టర్లు, బిటెక్ డిప్లమా 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ప్రొ కె కృష్ణారెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఈశ్వర్ రెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ జయరాంరెడ్డితో కలిసి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా వీసీ మాట్లాడుతూ.. 2వ సెమిస్టర్ 59.04 శాతం, 4వ సెమిస్టర్ 62.38 శాతం, బీటెక్ డిప్లొమా 79.70 శాతం ఫలితాలు వచ్చాయన్నారు.