News March 18, 2025
అన్నమయ్య: ఇద్దరు యువకులు దుర్మరణం

అన్నమయ్య జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. పీటీఎంకు చెందిన శ్రీనివాసులు(22), చందు(22) బి.కొత్తకోటలో సినిమా చూడాలని సోమవారం రాత్రి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళుతూ, బూర్లపల్లె వద్ద గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు అక్కడే మృతి చెందగా, చందును ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడన్నారు.
Similar News
News December 8, 2025
శరీరానికి కాపర్ అందితే కలిగే లాభాలు ఇవే!

శరీరానికి అవసరమైన కాపర్ అందితే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మతిమరుపు దరిచేరదు. వృద్ధులకు అల్జీమర్స్ ప్రమాదం ఉండదు. రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు దరిచేరవు. చర్మంపై ముడతలు, ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. క్యాన్సర్ సెల్స్ నాశనమవుతాయి. బాడీలో నుంచి ఫ్రీ రాడికల్స్ బయటకుపోతాయి.
News December 8, 2025
‘Mr.COOL’ వ్యాపార సామ్రాజ్యం @ ₹1000 కోట్లు

ధోనీలో క్రికెటే కాదు ఎవరూ గుర్తించని వ్యాపార కోణమూ ఉంది. కూల్గా ఫోకస్డ్గా ఆడుతూ ట్రోఫీలు సాధించినట్లే.. సైలెంట్గా ₹1000CR వ్యాపార సామ్రాజ్యాన్నీ స్థాపించారు. చెన్నైతో ఉన్న అనుబంధం అతని వ్యాపార దృక్పథాన్ని మార్చేసింది. చెన్నై ఫుట్బాల్ క్లబ్ కో ఓనర్ మొదలు కార్స్24, ఖాతాబుక్, EMotorad ఫర్ ఎలక్ట్రిక్ సైకిల్స్, Tagda Raho, సెవెన్ ఇన్ లైఫ్ స్టైల్ ఇలా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు.
News December 8, 2025
జిల్లా వ్యాప్తంగా పోలీసుల వాహన తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత, రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఫుట్ పెట్రోలింగ్ చేపట్టారు. రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని, డ్రంకన్ డ్రైవింగ్కు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.


