News June 23, 2024

అన్నమయ్య: ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

image

అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం సానిపాయ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు ఎర్రచందనం దుంగలతో పాటు కారు, మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి సానిపాయ పరిధిలో కూంబింగ్ చేపట్టగా అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు కారులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించగా, అరెస్ట్ చేశామని తెలిపారు.

Similar News

News December 22, 2025

అక్షర బాటలో బాలయపల్లె ప్రాథమిక పాఠశాల ఆయమ్మ

image

కాశినాయన మండలం బాలాయపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆయాగా యంబడి బాల నాగమ్మ చాలా కాలంగా పనిచేస్తోంది. చదువంటే ఆమెకు మక్కువ కానీ పరిస్థితులు అనుకూలించక నిరక్షరాస్యురాలిగానే ఉంది. పాఠశాలలో విద్యార్థులను గమనించిన ఆమె తనకు కూడా అక్షరాలు నేర్చుకోవాలని ఉందని ఉపాధ్యాయుడు ఖాసీం వల్లికి తెలిపింది. స్పందించిన ఉపాధ్యాయుడు ఆయమ్మకి ‘రోజుకో అక్షరం’ నేర్పుతున్నారు. ఆయమ్మ సంతోషం వ్యక్తం చేసింది.

News December 22, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.13540
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12457
☛ వెండి 10 గ్రాముల ధర: రూ.2080.

News December 22, 2025

పులివెందులకు రానున్న వైఎస్ జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 23వ తేదీ నుంచి 25వ వరకు పులివెందులలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 23వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. 24వ తేదీ ఇడుపులపాయకు చేరుకుని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం పులివెందులకు చేరుకుంటారు. 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు..