News March 17, 2025
అన్నమయ్య: ఒకవైపు తండ్రి మృతి.. మరో వైపు 10th పరీక్షలు

అన్నమయ్య జిల్లాలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోసుకుంది. గ్రామస్థుల వివరాల మేరకు.. పీటీఎం మండలం గొడుగువారిపల్లెకు చెందిన వెంకటరమణ(55)కు ఇద్దరు పిల్లలు ఉండగా, భార్య వదిలేసింది. కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించేవాడు. ఆదివారం చింతకాయలు కోయడానికి చెట్టుఎక్కి కింద పడి మృతి చెందాడు. దీంతో పిల్లలు అనాథలయ్యారు. కాగా నేడు వెంకటరమణ కుమార్తె పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News November 12, 2025
‘కాంత’ మూవీని నిషేధించాలని కోర్టులో పిటిషన్

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘కాంత’ సినిమాను నిషేధించాలని చెన్నైలో కోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ అనుమతి లేకుండా సూపర్ స్టార్ త్యాగరాజ భగవతార్ కథను వాడుకున్నారని ఆయన మనువడు పిటిషన్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన గొప్పగా జీవించారని, భగవతార్ గురించి తప్పుగా చూపించారని తెలిపారు. దీనిపై మూవీ యూనిట్ ఈ నెల 18లోగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. కాగా సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది.
News November 12, 2025
18 రోజులు.. ఈసారి మహాభారతమే

ఢిల్లీ పేలుడుతో ఉగ్రవాదులకు కేంద్రం ధీటుగా బదులు చెప్పాలని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ నెటిజన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పుల్వామా ఉగ్రదాడికి కేంద్రం 12 రోజుల్లో బాలాకోట్ స్ట్రైక్తో బదులిచ్చింది. పహల్గాం దాడికి 15 రోజుల్లో ఆపరేషన్ సింధూర్తో బుద్ధి చెప్పింది. తాజా దాడికి బదులిచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది’ అని ప్రశ్నించగా మరో నెటిజన్ 18 రోజులు అని బదులిచ్చారు. ఈసారి మహాభారతమే అని రాసుకొచ్చారు.
News November 12, 2025
గురువు పాదాలకు నమస్కరించిన మంత్రి కేశవ్

రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన చిన్ననాటి గురువు గంగాధర శాస్త్రిని పుట్టపర్తి శాంతి నిలయంలో మంగళవారం కలిశారు. గురువు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. విద్యార్థి దశలో బోధించిన ఉపాధ్యాయుడిని కలవడం ఆనందకరమైన క్షణమని మంత్రి భావోద్వేగంగా పేర్కొన్నారు. రాష్ట్రం గర్వించదగిన నాయకుడిగా శిష్యుడు ఎదగడంపై గంగాధర శాస్త్రి సంతోషం వ్యక్తం చేశారు.


