News April 8, 2025

అన్నమయ్య, కడప జిల్లాలో న్యాయమూర్తుల బదిలీలు

image

అన్నమయ్య, కడప జిల్లాల్లో జడ్జిలను, అదనపు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వారు ఏప్రిల్ 21 తేదీ లోపు చార్జ్ తీసుకోవాలని వివరించారు. శ్రీలతను ఖాళీగా ఉన్న అన్నమయ్య జిల్లా మదనపల్లి 7 అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. చిత్తూరు పోక్సో కోర్టు జడ్జి ఎన్. శాంతిని కడప ఆరవ అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు.

Similar News

News December 8, 2025

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట: ఎస్పీ

image

అమలాపురంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్‌కు సమస్యలపై 36 వినతులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు లిఖితపూర్వకంగా ఎస్పీకి సమస్యలు అందజేశారు. వాటిపై ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి చట్ట పరిధిలో విచారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

News December 8, 2025

మీ ఫ్రిజ్ ఎక్కువకాలం పనిచేయాలంటే?

image

* ఫ్రిజ్ కంపార్ట్‌మెంట్ టెంపరేచర్‌ను 4°C, ఫ్రీజర్‌ను -18°C వద్ద మెయింటేన్ చేయండి.
* వేడి కంటైనర్లను నేరుగా లోపల పెట్టవద్దు.
* సరిగ్గా డోర్ వేయండి. పదేపదే డోర్ తెరవొద్దు.
* ఫ్రిజ్ కాయిల్స్‌, లోపలి భాగాలను తరచూ క్లీన్ చేయండి.
* ఫ్రిజ్‌ను పూర్తిగా నింపేయకుండా ఖాళీ స్థలాన్ని ఉంచండి.
* ఫ్రిజ్ చుట్టూ కనీసం 10CM స్థలాన్ని వదలండి.
* ఒవెన్స్, డిష్ వాషర్స్, డైరెక్ట్ సన్‌లైట్‌కు దూరంగా ఫ్రిజ్‌ను ఉంచండి.

News December 8, 2025

బాపట్ల: అర్జీలు స్వీకరించిన కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అధికారులు పూర్తిస్థాయిలో విచారించి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు అర్జీలను అందజేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.