News March 3, 2025
అన్నమయ్య కలెక్టరేట్లో నేడు ప్రజా వేదిక.!

ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రమైన రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు.
Similar News
News November 7, 2025
కాగజ్నగర్: ఎస్ఎఫ్ఐ జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కుమురం భీం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా సుంకరి సాయి క్రిష్ణ, వసాకే సాయికుమార్లు ఎన్నికయ్యారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రూ. 8,600 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజులు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
News November 7, 2025
కల్వకుర్తిలో కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు

ఈ నెల 9న కల్వకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో జిల్లాస్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. 2006 తర్వాత జన్మించిన, 75 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న క్రీడాకారులు ఎస్ఎస్సీ, బోనఫైడ్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన కోరారు.
News November 7, 2025
నరసరావుపేట: వన మహోత్సవంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

కార్తీక మాసం సందర్భంగా కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వన భోజనాలు నిర్వహించారు. కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణా రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మొక్కలు నాటారు. సహజ సౌందర్యం నడుమ అధికారులు ఆనందంగా గడిపారు.


