News March 3, 2025

అన్నమయ్య కలెక్టరేట్‌లో నేడు ప్రజా వేదిక.!

image

ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రమైన రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు.

Similar News

News December 12, 2025

ప్రభుత్వ టీచర్ ఆదర్శం!

image

➤ తన బిడ్డకూ అదే బడి
SS: గవర్నమెంట్ టీచర్ తన కుమారుడినీ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రానికి చెందిన స్వర్ణ సోమందేపల్లి మండలంలోని కొలిమిపల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. తన కుమారుడు సాత్విక్‌ను ఇదే పాఠశాలలో చదివిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతోందనడానికి ఇదే నిదర్శనమని కొనియాడుతున్నారు.

News December 12, 2025

వైట్ డిశ్చార్జ్‌కి ఇలా చెక్ పెట్టండి

image

చాలామంది మహిళలకు వివిధ కారణాల వల్ల వైట్ డిశ్చార్జ్ జరుగుతుంది. దీనికి బియ్యం కడిగిన నీరు పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. ఈ నీటిని తాగడం వల్ల వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గడంతో పాటు చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. అలాగే మూత్ర విసర్జన సమయంలో మంట, విరేచనాలు, రక్తస్రావానికి సంబంధించిన రుగ్మతలు, పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

News December 12, 2025

సంగారెడ్డి: నేటి సాయంత్రం నుంచి ప్రచారాలపై నిషేధం: కలెక్టర్

image

రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాలు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు ప్రచారాలపై నిషేధాన్ని విధించినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎన్నికలు జరుగనున్న ఆందోల్, చౌటకూర్, ఝరాసంగం, కొహిర్, మొగుడంపల్లి, మునిపల్లి, పుల్కల్, రాయికోడ్, వట్పల్లి, జహీరాబాద్ మండలాల్లో 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలవుతుందని పేర్కొన్నారు.