News March 3, 2025
అన్నమయ్య కలెక్టరేట్లో నేడు ప్రజా వేదిక.!

ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రమైన రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు.
Similar News
News November 28, 2025
MDK: అన్నా నేను తాగుత లేనన్నా..!

ఎన్నికలు రావడంతో ఉమ్మడి MDKలో మద్యంప్రియులు జాగ్రత్తలు పడుతున్నారు. నిత్యం సారా, చీప్లిక్కర్ తాగి జేబులు ఖాళీ చేసుకున్న వాళ్లు ఇప్పుడు కొత్తపాట పాడుతున్నారు. ‘అన్నా ఆరోగ్యం బాగుండట్లేదు. డాక్టర్ చీప్లిక్కర్ తాగొద్దన్నారు’ అంటూ పెద్ద మందుకు టెండర్ పెడుతుండటంతో పోటీదారులు ఖంగు తింటున్నారు. నిన్నటి వరకు ఏదో ఒకటి తాగిన వాళ్లు ఇప్పుడు టీచర్స్, 100 పైపర్స్ వంటి బ్రాండ్లను డిమాండ్ చేస్తున్నారట.
News November 28, 2025
వరంగల్: ప్రైవేట్ పీఏకు రూ.90 వేలు

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఫెయిలైనవారికి మార్కులు కలపడంతో మొదలైన అవినీతి బండారం విజిలెన్సు విచారణలో విస్తుపోయేలా బయటకు వస్తున్నాయి. WGL విజిలెన్సు అధికారుల చేతిలో అవినీతి చిట్టా ఉన్నట్లు తెలిసింది. నోటిఫికేషన్ లేకుండా ప్రైవేట్గా ఉద్యోగులను పెట్టుకున్న విషయం బయటకు వచ్చింది. రూ.90 వేల వేతనంతో కాంట్రాక్టు పద్ధతిలో వీసీ పీఏను అంటూ చలామణి అవుతున్న వ్యక్తి బండారం బయటపడింది.
News November 28, 2025
పల్నాడు పర్యాటకం ఇక కళకళ..

పర్యాటక శాఖ స్వదేశీ దర్శన్లో భాగంగా పల్నాడు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అమరావతిలోని 125 అడుగుల జ్ఞాన బుద్ధ విగ్రహం, కోటప్పకొండ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే DPR సిద్ధం చేశారు. సాగర్ వద్ద వరల్డ్ క్లాస్ బుద్ధిష్ట్ హెరిటేజ్ సెంటర్, గుత్తికొండ బిలం రహదారి, అమరావతి కాలచక్ర మ్యూజియం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.


