News March 3, 2025
అన్నమయ్య కలెక్టరేట్లో నేడు ప్రజా వేదిక.!

ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రమైన రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు.
Similar News
News November 13, 2025
కామారెడ్డిలో రైటర్స్కు శిక్షణా కార్యక్రమం

కామారెడ్డి జిల్లా పోలీస్ ఆఫీస్లో గురువారం రైటర్స్కు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర పాల్గొని, రైటర్లకు విధులు, బాధ్యతలు, రికార్డు నిర్వహణ, వృత్తి నైపుణ్యాలపై మార్గదర్శక సూచనలు, పోలీస్ శాఖలో పారదర్శకత, రైటర్ల పాత్ర ఎంతో ముఖ్యమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పీఎస్, సర్కిల్, డీఎస్పీ కార్యాలయాలకు చెందిన రైటర్లు ఉన్నారు.
News November 13, 2025
షమీని ఎందుకు తీసుకోవట్లేదు? గిల్ సమాధానమిదే

షమీ లాంటి బౌలర్లు చాలా తక్కువ మంది ఉంటారని IND టెస్ట్ కెప్టెన్ గిల్ అన్నారు. ఆయన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదు, ఫ్యూచర్లో చేస్తారా అనే ప్రశ్నలకు తనకంటే సెలక్టర్లే బెటర్గా సమాధానం ఇవ్వగలరని ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నారు. ప్రస్తుతమున్న బౌలర్లు చాలా బాగా రాణిస్తున్నారని గుర్తుచేశారు. SAతో జరగనున్న తొలి టెస్టులో ఆల్రౌండర్ లేదా ఎక్స్ట్రా స్పిన్నర్ను ఆడించే విషయంపై రేపే నిర్ణయం తీసుకుంటామన్నారు.
News November 13, 2025
రాష్ట్రంలో 107 ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

ఏపీ మెడికల్ &హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆయూష్ విభాగంలో 107 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, MBA, M.COM, CA, ICWA, MD, BAMS, BHMS, BUMS, BNYS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, BC, EWSలకు రూ.750. వెబ్సైట్: https://apmsrb.ap.gov.in/


