News March 28, 2024
అన్నమయ్య: గుండెపోటుతో మున్సిపల్ కౌన్సిలర్ మృతి

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి మున్సిపాలిటీలోని 30వ వార్డు కౌన్సిలర్ ఆసిఫ్ అలీ ఖాన్ గుండెపోటుతో గురువారం మద్యాహ్నం మృతిచెందారు. వైసీపీలో కీలక వ్యక్తి అయినటువంటి ఆసిఫ్ అలీ ఖాన్ మృతితో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆ వార్డు పరిధిలో ఆయన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని స్థానికులు చెప్పుకొచ్చారు.
Similar News
News February 8, 2026
ప్రొద్దుటూరులో ACP సస్పెండ్తో నైనా.. అధికారుల అవినీతి తగ్గేనా?

ప్రొద్దుటూరు ACP నాగరాజు సస్పెండ్తో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తి అవినీతి మయంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇళ్లు, షాపులు, అపార్ట్మెంట్లు, కాంప్లెక్సులు ప్రతి నిర్మాణానికి అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారట. మామూళ్ల వసూలు కోసం ఏజెంట్లను సైతం పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. కింది స్థాయి సిబ్బంది మొదలుకొని, TPO, ACP వరకు అందరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News February 8, 2026
గాండ్ల సంక్షేమ కార్పొరేషన్ కోసం CMకు వినతి

గాండ్ల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును శనివారం విజయవాడలో కలిసి విన్నవించినట్లు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య తెలిపారు. గాండ్ల సంఘం అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ కావాలని, నూనె తయారీ యూనిట్లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని విన్నవించినట్లు తెలిపారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.
News February 8, 2026
కడపలో నేడు పోటీలు.. గెలిస్తే రూ.70 వేలు.!

కడప నగరంలోని బిల్డప్ దగ్గర కొలువైన పోలేరమ్మ తల్లి తిరుణాల సందర్భంగా ఆదివారం బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి బహుమతి రూ.70 వేలు, రెండో బహుమతి రూ.50 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇలా ఐదు బహుమతులు వరకు ఉంటాయన్నారు. ఎద్దుల యజమానులు నిర్దేశించిన సమయంలో అక్కడికి చేరుకోవాలని కమిటీ సభ్యులు తెలిపారు.


