News January 25, 2025

అన్నమయ్య జిల్లాకు మొదటి స్థానం

image

సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో అన్నమయ్య జిల్లా విద్యార్థులు మొదటి స్థానం సాధించారని జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి తెలిపారు. ఈనెల 20 నుంచి 25వ తేది వరకు పుదుచ్చేరిలోని ఓల్డ్ పోర్ట్ గ్రౌండ్‌లో సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ పోటీలు జరిగాయి. అన్నమయ్య జిల్లా కలకడ మోడల్ స్కూల్‌ విద్యార్థులు మహమ్మద్ సుహేల్, రెహాన్ మొదటి స్థానం కైవసం చేసుకున్నారు.

Similar News

News December 13, 2025

భద్రాద్రి జిల్లాలో రెండో విడతలో ఏకగ్రీవమైన జీపీలు..

image

భద్రాద్రి జిల్లాలోని 7 మండలాల్లో రేపు రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
వివరాలిలా.. అన్నపురెడ్డిపల్లి(M) గుంపెన – ధారబోయిన నరసింహ, ఊటుపల్లి – వాడే వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట(M) మద్దికొండ- తాటి రామకృష్ణ, రామన్నగూడెం- మడకం నాగేశ్వరరావు, ములకలపల్లి(M) పొగళ్లపల్లి – మడకం రవి, చండ్రుగొండ(M) బెండలపాడు-బొర్రా లలిత, మంగయ్య బంజర- మాలోత్ గోపికృష్ణ.

News December 13, 2025

15న టెక్కలిలో ప్రజా వేదిక: కలెక్టర్

image

ఈనెల 15న టెక్కలిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం తెలిపారు. టెక్కలి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని నూతన సమావేశ మందిరంలో నిర్వహిస్తారని చెప్పారు. ఈ వేదికలో ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 13, 2025

పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ రోహిత్ రాజు

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, పంచాయతీల వారీగా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.