News January 26, 2025
అన్నమయ్య జిల్లాకు మొదటి స్థానం

సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్లో అన్నమయ్య జిల్లా విద్యార్థులు మొదటి స్థానం సాధించారని జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి తెలిపారు. ఈనెల 20 నుంచి 25వ తేది వరకు పుదుచ్చేరిలోని ఓల్డ్ పోర్ట్ గ్రౌండ్లో సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ పోటీలు జరిగాయి. అన్నమయ్య జిల్లా కలకడ మోడల్ స్కూల్ విద్యార్థులు మహమ్మద్ సుహేల్, రెహాన్ మొదటి స్థానం కైవసం చేసుకున్నారు.
Similar News
News December 22, 2025
చింతల్ ఠాణాలో సర్పంచ్ లేకుండానే ప్రమాణం

వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీ పంచాయతీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ సర్పంచ్ లేకుండానే పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారాన్ని నిర్వహిస్తున్నారు. సర్పంచ్గా పోటీ చేసిన శేర్ల మురళి ఈనెల 4న గుండెపోటుతో మృతిచెందగా, 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో 358 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. దీంతో ప్రస్తుతానికి ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయించాలని అధికారులు నిర్ణయించారు.
News December 22, 2025
సిరిసిల్ల: కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు

సిరిసిల్ల జిల్లాలోని గ్రామపంచాయతీ పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 260 జీపీలు, 2,268 వార్డుల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. నిధుల సమస్యతో ప్రమాణ స్వీకార ఖర్చు విషయంలో కార్యదర్శులు తర్జనభర్జన పడుతున్నారు.
News December 22, 2025
కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా జబిబుల్లా

కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ప్రొద్దుటూరు మైనార్టీ నేత జబిబుల్లాను పార్టీ అధిష్టానం నియమించింది. ప్రొద్దుటూరుకు చెందిన జబిబుల్లా టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్గా, వైఎస్ ఛైర్మన్గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల స్థానిక టీడీపీ శ్రేణులు, మైనార్టీ నేతలు అభినందనలు తెలిపారు. తన నియామకానికి మద్దతునిచ్చిన, సహకరించిన స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి జబిబుల్లా కృతజ్ఞతలు తెలిపారు.


