News February 13, 2025

అన్నమయ్య జిల్లాలో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం

image

కె.వి పల్లి మండలం, తీతా గుంటపల్లి పంచాయతీ ఈతమాను వడ్డిపల్లి వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి రాయచోటికి వస్తున్న కారు పొగమంచు కారణంగా మోరీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108 సహాయంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 27, 2025

KMR: జిల్లాలో నేటి నుంచి నామినేషన్ల జాతర!

image

కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఇయాల్టి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఎన్నికల మొదటి విడతలో భాగంగా, జిల్లాలోని 167 గ్రామ పంచాయతీలు (1520 వార్డులకు) ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి రోజు నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు ఎంత ఉత్సాహం చూపిస్తారో, ఎంత మంది నామినేషన్ వేస్తారో అనేది చూడాలి. నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

News November 27, 2025

జిల్లాలో నేటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల స్వీకరణ ఇవాళ్టి నుంచి 29వ తేదీ వరకు కొనసాగనుంది. వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లోని 85 సర్పంచ్ స్థానాలు, 748 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలివిడత నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

News November 27, 2025

జనగామ: నేడు మొదటి విడత జీపీ ఎన్నికల నామినేషన్లు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లను ఈరోజు ఉ.10 నుంచి సా.5 గం.ల వరకు అధికారులు స్వీకరించనున్నారు. మొదటి విడతలో జనగామ జిల్లాలో చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథపల్లి, లింగాల ఘనపూర్, జఫర్గడ్ మండలంలోని 110 గ్రామపంచాయతీలు, 1024 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.