News February 13, 2025

అన్నమయ్య జిల్లాలో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం

image

కె.వి పల్లి మండలం, తీతా గుంటపల్లి పంచాయతీ ఈతమాను వడ్డిపల్లి వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి రాయచోటికి వస్తున్న కారు పొగమంచు కారణంగా మోరీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108 సహాయంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 16, 2025

తూ.గో: మూడేళ్లుగా కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి

image

పెరవలి మండలంలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల కుమార్తెపై కన్న తండ్రే మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భం దాల్చడంతో తల్లికి ఈ విషయం తెలిసింది. ఆమె భర్తను నిలదీయగా వివాదం జరిగింది. బాధితురాలు తన తల్లితో కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పెనుమంట్రలో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసును పెరవలి స్టేషన్‌కు బదిలీ చేశారు.

News November 16, 2025

అది ఛేజ్ చేయగలిగే టార్గెటే: గంభీర్

image

టెస్టుల్లో ఆడాలంటే స్కిల్‌తో పాటు మెంటల్ టఫ్‌నెస్ ఉండాలని IND హెడ్ కోచ్ గంభీర్ అన్నారు. SAతో తొలి టెస్టులో <<18303459>>ఓటమి<<>> అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘124 ఛేజబుల్ టార్గెటే. పిచ్ ఆడేందుకు వీలుగానే ఉంది. ఇలాంటి పిచ్‌పై ఆడాలంటే టెక్నిక్, టెంపెరమెంట్ ఉండాలి. ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ వికెట్లు పడ్డాయి. మేం అడిగిన పిచ్‌నే క్యూరేటర్ తయారు చేశారు. బాగా ఆడనప్పుడు ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.

News November 16, 2025

రేపు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్

image

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కలెక్టరేట్‌లో సోమవారం PGRSను నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.