News February 13, 2025
అన్నమయ్య జిల్లాలో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం

కె.వి పల్లి మండలం, తీతా గుంటపల్లి పంచాయతీ ఈతమాను వడ్డిపల్లి వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి రాయచోటికి వస్తున్న కారు పొగమంచు కారణంగా మోరీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108 సహాయంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 16, 2025
ఎట్టకేలకు అమ్ముడైన పృథ్వీ షా

యంగ్ బ్యాటర్ పృథ్వీషాకు ఎట్టకేలకు ఊరట దక్కింది. ఐపీఎల్-2026 మినీ వేలం తొలి రౌండ్లో షా అమ్ముడుపోలేదు. మరో రౌండ్లో బేస్ ప్రైస్ రూ.75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని సొంతం చేసుకుంది. గతంలో ఇతడు ఢిల్లీ తరఫునే ఆడారు. 79 మ్యాచుల్లో 1,892 రన్స్ చేశారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లు జేమీసన్ను రూ.2 కోట్లకు ఢిల్లీ, ఆడమ్ మిల్నేను రూ.2.4 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది.
News December 16, 2025
TDP బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా సలగలకు మరో అవకాశం..?

TDP బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్ బాబుకు మరోసారి అవకాశం రానుందని జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసిన సలగల బెంజిమెన్ కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కూటమి ప్రభుత్వం విజయం అనంతరం ప్రస్తుతం బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. మరి పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని ప్రజలు చర్చించుకుంటున్నారు.
News December 16, 2025
నాగర్ కర్నూల్ జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

√ఎర్రవల్లిలో 15వ రోజుకు చేరిన రీలే నిరాహార దీక్షలు
√చారకొండ: ఎర్రవల్లి గ్రామంలో రేపటి పోలింగ్ బహిష్కరణ
√వంగూర్: జాతీయ రహదారిపై కారు బోల్తా.. తప్పిన ప్రమాదం
√కొల్లాపూర్ ఇన్చార్జ్ ఎంఈఓ గా అబ్దుల్ రహీం
√అచ్చంపేట నియోజకవర్గంలో రేపు సర్పంచ్ ఎన్నికలు
√కొల్లాపూర్: నూతన సర్పంచులకు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సన్మానం
√అచ్చంపేట: బొమ్మనపల్లి పోలింగ్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ.


