News March 1, 2025
అన్నమయ్య జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

అన్నమయ్య జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 49 పరీక్ష కేంద్రాల్లో.. 14,862 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 49 మంది చీఫ్ సూపరింటెండెంట్లను అధికారులు నియమించారు.
☞ విద్యార్థులకు ALL THE BEST
Similar News
News October 17, 2025
బాపట్ల జిల్లాకు ఎల్లో అలెర్ట్

బాపట్ల జిల్లాకు విశాఖ వాతావరణ కేంద్రం శుక్రవారం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు గంటల్లో గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడుతుందన్నారు. గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దీంతో ప్రజలు, రైతులు జాగ్రత్తలు పాటించాలని బాపట్ల జిల్లా అధికారులు సూచించారు.
News October 17, 2025
అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేయరాదు: ఎస్పీ

పోలీసుల అనుమతి లేకుండా కడప జిల్లా వ్యాప్తంగా ఇళ్లల్లో బాణాసంచా నిలువలు కానీ బాణసంచా నిల్వలు, విక్రయాలు చేయరాదని ఎస్పీ నచికేత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే టపాసుల విక్రయాలు చేయాలని, అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 17, 2025
ఉమ్మడి జిల్లాలో కల్తీ మద్యం లేదు: డిప్యూటీ కమిషనర్

ఉమ్మడి జిల్లాలో ఎటువంటి కల్తీ మద్యం లేదని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి అన్నారు. విజయనగరంలోని శుక్రవారం ఆయన మాట్లాడుతూ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో తమ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేశారని, ఎక్కడ కల్తీ మద్యం లేదని చెప్పారు. వైన్ షాపులు, బార్ షాపులను తనిఖీ చేశామన్నారు. ప్రజలకు సురక్షతమైన మద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు.