News March 1, 2025

అన్నమయ్య జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

అన్నమయ్య జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 49 పరీక్ష కేంద్రాల్లో.. 14,862 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 49 మంది చీఫ్ సూపరింటెండెంట్లను అధికారులు నియమించారు.
☞ విద్యార్థులకు ALL THE BEST

Similar News

News November 29, 2025

వరంగల్: ఆ సీసీపై ఎందుకంత ప్రేమ..?

image

ఆయనో జిల్లా అధికారి. ఆయన దగ్గర వినయ విధేయతలతో పనిచేసినందుకు తనతో పాటు అతన్ని తీసుకెళ్లిన ఘటన ఉమ్మడి వరంగల్‌లో జరిగింది. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆ జిల్లా అధికారికి పక్కనే ఉన్న జిల్లాకు బదిలీ అయ్యింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, తనతో పాటుగా తన దగ్గర పనిచేస్తున్న క్యాంపు కర్ల్కును సైతం వెంట తీసుకెళ్లడం హాట్ టాపికైంది. సీసీ దగ్గర మొత్తం బాగోతం ఉండటంతోనే అతన్ని కూడా వెంట తీసుకెళ్లారంటూ చర్చ జరుగుతోంది.

News November 29, 2025

మంత్రి వద్దన్నా.. రేణిగుంటలో మళ్లీ పోస్టింగ్.!

image

అవినీతి ఆరోపణలతో సస్పెండైన రేణిగుంట రిజిస్ట్రార్ ఆనంద్ రెడ్డి మళ్లీ అక్కడే పోస్టింగ్ పొందారు. ఆయనకు ఉద్యోగం ఇవ్వాలంటూ స్పెషల్ CS పంపిన ఫైల్‌ను మంత్రి అనగాని తిరస్కరించారు. ఇందుకు విరుద్ధంగా ఇటీవల చిత్తూరు రిజిస్ట్రేషన్ శాఖ ఇన్‌ఛార్జ్ DIGగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఆనంద్‌కు మళ్లీ రేణిగుంటలో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆనంద్ రేంజ్ ఏంటో అర్థమవుతుందని పలువురు చర్చించుకుటున్నారు.

News November 29, 2025

GNT: సైలెంట్ అయిపోయిన సీనియర్ నేతలు

image

గుంటూరు జిల్లాలో సీనియర్ నేతలు రాయపాటి సాంబశివరావు, మోపిదేవి వెంకటరమణ రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి ఇంటికే పరిమితమయ్యారు. అటు వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగి, ఇటీవలే టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. పార్టీ మారిన తర్వాత ఆయన యాక్టివ్‌గా లేకపోవడం కార్యకర్తలను సైతం అయోమయానికి గురిచేస్తోంది.