News March 4, 2025

అన్నమయ్య జిల్లాలో నేడు కూడా పెన్షన్ల పంపిణీ.!

image

అన్నమయ్య జిల్లాలో 1వ తేదీ నుంచి పెన్షన్‌లు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే వివిధ కారణాలతో ఈ నెల పెన్షన్ తీసుకోని వారికి నేడు కూడా పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క అన్నమయ్య జిల్లాలోనే కాకుండా అనంతపురం, తిరుపతి, చిత్తూరు, , ఎన్టీఆర్, కర్నూలు, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని లబ్ధిదారులకు కూడా ఈ అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

Similar News

News January 7, 2026

సిద్దిపేట: పెళ్లికి కులం అడ్డంకి.. యువ డాక్టర్ ప్రాణం బలి!

image

సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ <<18764829>>లావణ్య<<>>(23) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అదే కళాశాలలో జనరల్ మెడిసిన్ చదువుతున్న సికింద్రాబాద్‌కు చెందిన ప్రణయ్‌కి 2025 జులైలో లావణ్యతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.వివాహం చేసుకుంటానని చివరికి కులాన్ని అడ్డుగా చూపించి నిరాకరించాడు. దీంతో గడ్డి మందు ఇంజెక్ట్ చేసుకుని లావణ్య సూసైడ్ చేసుకుంది. ప్రణయ్ పై సిద్దిపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

News January 7, 2026

కరీంనగర్‌లో హుస్నాబాద్‌ విలీనం ఖాయమేనా?

image

హుస్నాబాద్ నియోజకవర్గం 3 జిల్లాల పరిధిలో ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌ను KNRలో విలీనం చేయాలని సీఎంకి పలుమార్లు విన్నవించారు. ఈ క్రమంలో మరోసారి జిల్లాల పునర్విభజన పరిశీలిస్తామని మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ప్రకటించారు. ఒకే జిల్లా పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేలా చేస్తామని చెప్పడంతో హుస్నాబాద్ KNRలో విలీనం ఖాయమన్న చర్చ నడుస్తుంది.

News January 7, 2026

పొలవరానికి సీఎం రాక.. షడ్యూల్ ఇదే!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 10.20 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటల వరకు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. డయాఫ్రం వాల్ నిర్మాణం, ఇతర కీలక పనుల పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 2.55 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.