News February 15, 2025

అన్నమయ్య జిల్లాలో ప్రేమోన్మాది ఎమ్మెల్యే అనుచరుడి కుమారుడే: YCP

image

అన్నమయ్య జిల్లాలో యువతి గౌతమిపై ప్రమోన్మాది గణేశ్ యాసిడ్ దాడి రాష్ట్రంలో సంచలమైంది. ఈ ఘటనలో యువకుడు టీడీపీ కార్యకర్త అని వైసీపీ ఆరోపించింది. కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళి కుమారుడే గణేశ్ అని ట్వీట్ చేసింది. యువకుడి తండ్రి మురళికి టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయంటూ పలు ఫొటోలను పోస్ట్ చేసింది. మరోవైపు ఈ ఘటనలో గాయపడ్డ యువతికి బెంగళూరులో చికిత్స అందిస్తున్నారు.

Similar News

News February 25, 2026

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 మంది వైద్యులపై వేటు

image

రాష్ట్రంలో విధులకు హాజరుకాకుండా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న 94 మంది వైద్యులను తొలగిస్తూ డీఎంఈ నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 12 మంది ఉన్నారు. రామగుండంలో డా.మంజుల, నిఖిల్, ప్రదీప్, వినయ్, అనుష, స్వాతి, సాయికిరణ్, స్ఫూర్తిరావు, కరీంనగర్‌లో డా.సింధు, హిమజ, సిరిసిల్లలో డా.పర్వీన్ ఫాతిమా, రవికుమార్‌లపై వేటు పడింది. ఏడాదికి పైగా విధులకు రానందుకు తొలగించారు.

News February 25, 2026

ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన వనపర్తి కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ తీరును కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం స్వయంగా పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష గదుల్లో వెలుతురు, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, సీసీ కెమెరాల నిఘాను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌కు తావులేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News February 25, 2026

NZvsSL: ఇవాళ ఓడితే శ్రీలంక ఇంటికే

image

T20WC సూపర్-8లో భాగంగా గ్రూప్-2లో న్యూజిలాండ్-శ్రీలంక మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. కొలంబో వేదికగా 7PMకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడిన శ్రీలంక ఇవాళ కూడా పరాజయం పాలైతే ఇంటిబాట పట్టనుంది. కివీస్ గెలిస్తే సెమీస్ రేసులో నిలుస్తుంది. నిన్న పాక్‌పై గెలుపుతో ఇంగ్లండ్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 27న ENGvsNZ, 28న SLvsPAK మ్యాచ్‌ల ఫలితాలను బట్టి రెండో స్థానంపై క్లారిటీ రానుంది.