News April 15, 2025

అన్నమయ్య జిల్లాలో ముగ్గురి మృతి

image

అన్నమయ్య జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. కలకడ మండలం దాసిరెడ్డిగారి పల్లెలో ఆదిలక్ష్మి ఆనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ములకల చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నప్ప చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కురుబలకోటలో కరెంట్ షాక్‌తో రమేశ్ మృతి చెందారు.

Similar News

News November 2, 2025

రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు జిల్లా జట్టు పయనం

image

రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలకు శ్రీ సత్యసాయి జిల్లా తరఫున పాల్గొనే జట్టు నేడు నరసరావుపేటకు బయలుదేరినట్లు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ పూల ప్రసాద్ తెలిపారు. 19వ రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలు నేడు నరసరావుపేటలో ప్రారంభం కానున్నాయి. జిల్లా నుంచి ప్రాతినిద్యం వహించే ధర్మవరం బీఎస్సార్ మున్సిపల్ పాఠశాల క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని అనంతపురం జిల్లా సెక్రటరీ లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు.

News November 2, 2025

రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి: కలెక్టర్

image

జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువుగా తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్‌లోని మినీ కాన్ఫరెన్స్ లో భారతీయ రెడ్ క్రాస్ సమైక్య అనంతపురం శాఖ కార్యకలాపాలను సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రక్త కేంద్రాలలో సరిపడా రక్త నిల్వ ఉండేలా చూసుకోవడం ముఖ్యమైందని తెలిపారు.

News November 2, 2025

సీటు కేటాయిస్తే చదువుకుంటా సారు..!

image

ఆదోని KGBV పాఠశాలలో చదువుతూ చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సోగునూరుకు చెందిన నివేదితను ఎమ్మిగనూరు KGBVకు తల్లితండ్రులు DEO రెఫర్ ద్వారా మార్చుకున్నారు. అయితే DEO ఆదేశాలను లెక్కచేయని GCDO నివేదిత చదువుకు ఆటంకం కలిగిస్తోంది. YGRలో సీటు ఇవ్వాలని ప్రాధేయపడినా ఆమె చలించలేదు. ప్రస్తుతం బాలికను తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలకు తీసుకెళుతున్నారు. సీటు కేటాయిస్తే చదువుకుంటానని బాలిక తెలిపింది.