News March 4, 2025
అన్నమయ్య జిల్లాలో రూ.10 లక్షలు చోరీ.!

దారికాచి కొందరు డబ్బు అపహరించారని సుండుపల్లె మండలానికి చెందిన బాధితుడు వేణుగోపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే సోమవారం సుండుపల్లి నుంచి కుంటల గ్రామానికి వెళ్తుండగా చోరీ జరిగినట్లు తెలిపాడు. గుర్రప్ప చెరువు వద్ద ముగ్గురు అడ్డగించి, తనవద్ద ఉన్న రూ.10 లక్షలు దొంగలించారని వేణు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న SI శ్రీనివాసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 19, 2025
పాలకొల్లు: ఐఈఎస్లో సత్తాచాటిన లంకలకోడేరు యువతి

పాలకొల్లు మండలం లంకలకోడేరుకు చెందిన కవిత బేబీ బుధవారం రాత్రి విడుదలైన యూపీఎస్సీ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్ ) ఫలితాల్లో 48వ ర్యాంకుతో సత్తాచాటింది. తాను తొలిసారి 2024లో యూపీఎస్సీ పరీక్షకు హాజరై విఫలమయ్యానని, పట్టుదలతో కృషి చేసి ఇప్పుడు మంచి ర్యాంకు సాధించానని కవిత పేర్కొన్నారు. టెలీకమ్యూనికేషన్ శాఖలో ఉద్యోగం సాధించాలనేది తన ఆశయమన్నారు. కవితకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
News December 19, 2025
ధన్వాడ: తండ్రి అడుగుజాడల్లో.. కుమారుడి విజయం

ధన్వాడ మండలంలోని మందిపల్లిలో తండ్రి వారసత్వాన్ని కుమారుడు సురేందర్ రెడ్డి కొనసాగిస్తున్నారు. గతంలో ఆయన తండ్రి నరసింహారెడ్డి (1964-88) సుదీర్ఘకాలం సర్పంచ్గా సేవలందించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న సురేందర్ రెడ్డి.. 1994లో ఉప సర్పంచ్గా, 2001లో సర్పంచ్గా గెలిచారు. తాజాగా 2025 ఎన్నికల్లోనూ సర్పంచ్గా ఎన్నికై తమ కుటుంబానికి ఓటమి లేదని నిరూపించారు.
News December 19, 2025
నల్గొండ: జనవరి నుంచి HPV టీకాలు

మహిళల్లో వచ్చే క్యాన్సర్లను అరికట్టాలనే లక్ష్యంతో 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలందరికీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ (HPV)ను వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. HPV టీకాలపై డీఎంహెచ్ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్లు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ టీకాలను 2026 జనవరి నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇస్తామన్నారు.


