News January 25, 2025
అన్నమయ్య జిల్లాలో షాపులు వీరికే!

అన్నమయ్య జిల్లాలో కల్లు, గీత కార్మికులకు కలెక్టర్ చామకూరి శ్రీధర్ షాపులు కేటాయించారు. పీలేరు మండలంలో-గౌండ్ల, బి.కొత్తకోటరూరల్-గౌడ్, మదనపల్లె మున్సిపాలిటీ -ఈడిగ, రాజంపేట మున్సిపాలిటీ -ఈడిగ, తంబళ్లపల్లె మండలం -ఈడిగ, రామసముద్రం మండలం -ఈడిగ, నిమ్మనపల్లి మండలం -ఈడిగ, కలకడ మండలం -ఈడిగ, వీరబల్లి మండలం -ఈడిగ, నందలూరు మండలం -గౌడ, రాయచోటి మున్సిపాలిటీ- గౌడ్ లకు కేటాయించారు.
Similar News
News December 3, 2025
₹274 కోట్లు దోచి పరారైన డోన్ రియల్టర్!

డోన్కు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని ప్రముఖుల నుంచి ₹274 కోట్లు అప్పులు, పెట్టుబడుల రూపంలో వసూలు చేసి అమెరికా పరారయ్యాడు. చిరుద్యోగి అయిన అతడు స్థిరాస్తి వ్యాపారంలోకి దిగి బెంగళూరులో ఆఫీస్ ప్రారంభించాడు. సొంత డబ్బుతో విదేశీ యాత్రలు, పార్టీలు ఇస్తూ ప్రముఖులకు దగ్గరై భారీగా డబ్బులు వసూలు చేశాడు. కొన్ని రోజులుగా అందుబాటులో లేకపోవడంతో బాధితులు బయటకు చెప్పలేక కుమిలిపోతున్నారు.
News December 3, 2025
తిరుపతి: ఫ్రెండే చంపేశాడు..!

తిరుపతి జిల్లాలో వరదయ్యపాలెం(M) లక్ష్మీపురం మిట్టకాలనీలో ఓ యువకుడు <<18446943>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. ఎస్ఐ మల్లికార్జున వివరాల మేరకు.. గ్రామానికి చెందిన హరి(33)కి తన స్నేహితుడు గౌతమ్కు మధ్య పాత గొడవలు ఉన్నాయి. మద్యం తాగుదామని హరిని గౌతమ్ పిలిచాడు. అక్కడ గొడవ చెలరేగి గౌతమ్, అతని సోదరుడు ప్రేమ్ కుమార్, చెన్నైకి చెందిన మరో ఇద్దరు హరిని రాయితో కొట్టి చంపేశారు. తర్వాత పక్కనే ఉన్న ఇంట్లో పడేసి వెళ్లిపోయారు.
News December 3, 2025
మహబూబాబాద్: 158 సర్పంచ్ స్థానాలకు 1118 నామినేషన్లు

జిల్లాలోని రెండవ దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ మంగళవారంతో ముగిసింది. రెండో దశలోని నామినేషన్ వివరాలను అధికారులు వెల్లడించారు. బయ్యారం 167, చిన్నగూడూరు 66, దంతాలపల్లి 116, గార్ల 136, నర్సింహులపేట 155, పెద్ద వంగర 186, తొర్రూర్ 292, మొత్తం 1118 సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. కాగా, ఆయా పంచాయతీలలో 3434 వార్డ్ మెంబర్ నామినేషన్లు స్వీకరించామన్నారు.


