News January 25, 2025

అన్నమయ్య జిల్లాలో 11 కొత్త మద్యం షాపులు ఏర్పాటు

image

అన్నమయ్య జిల్లాకు 11 మద్యం దుకాణాలు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి మంజూరైన మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో షాపులను ఎంపిక చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కల్లు, గీత కార్మికులను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వృత్తిని నమ్ముకున్నవారికి 11 మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని కలెక్టర్ తెలిపారు.

Similar News

News September 14, 2025

చిన్న చింతకుంట: 24న బ్రహ్మోత్సవాల పనులకు టెండర్లు

image

కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయం వద్ద వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు గాను ఈ నెల 24న సీల్డ్ కవరు టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మధనేశ్వర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఫ్లవర్ డెకరేషన్, లైటింగ్, కలర్స్ వేయడం, చలువ పందిళ్లు, ప్రింటింగ్ మెటీరియల్, టెంటు, పూజా సామగ్రి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి గల వారు టెండర్లు వేయాలని కోరారు.

News September 14, 2025

తిరుమల శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి సర్వదర్శనం క్యూ లైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి కొనసాగుతోంది. వేంకటేశ్వరస్వామి దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. శనివారం 82,149 మంది స్వామి వారిని దర్శించుకోగా 36,578 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు వచ్చిందని ప్రకటించింది.

News September 14, 2025

HYD: 1000 టన్నుల నిమజ్జన వ్యర్ధాలు తొలగింపు

image

వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత హుస్సేన్‌సాగర్‌తో పాటు చుట్టూ ఉన్న రోడ్లు, ఫుట్‌పాత్‌ల నుంచి GHMC, HMDA సిబ్బంది 1000 టన్నుల నిమజ్జన వ్యర్థాలు, చెత్తాచెదారం తొలగించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 500 మంది పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగింపులో నిమగ్నం అయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నిమజ్జన వ్యర్థాలు 150 టన్నుల మేర అదనంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు.