News January 25, 2025
అన్నమయ్య జిల్లాలో 11 కొత్త మద్యం షాపులు ఏర్పాటు

అన్నమయ్య జిల్లాకు 11 మద్యం దుకాణాలు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి మంజూరైన మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో షాపులను ఎంపిక చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కల్లు, గీత కార్మికులను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వృత్తిని నమ్ముకున్నవారికి 11 మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 16, 2025
కల్వకుర్తి: తెలకపల్లి బస్సు పునః ప్రారంభం

భారీ వర్షాల నేపథ్యంలో దుందుభి వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల కల్వకుర్తి నుంచి రఘుపతి పేట మీదుగా తెలకపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. దుందుభి వాగులో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఆర్టీసీ బస్సులను పునః ప్రారంభించారు. డీఎం సుభాషిని శనివారం దుందుభి వాగును పరిశీలించిన అనంతరం ఆదివారం ఉదయం బస్సు సౌకర్యం కల్పించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
News November 16, 2025
ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా

అదిలాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. బజార్హత్నూర్ 8.4°C, పొచ్చర 9, సత్నాల 9.5, సోనాల 9.6, పిప్పల్ దారి 9.8, అర్లి(T) 9.9, ఆదిలాబాద్ అర్బన్ 10.1, తలమడుగు 10.3, రామ్ నగర్ 10.4, భరంపూర్ 10.7, తాంసి 10.8, గుడిహత్నూర్ 11.3, హీరాపూర్ 11.4, సిరికొండ 11.6, ఇచ్చోడ, ఉట్నూర్(X రోడ్) 12.4°C లుగా నమోదయ్యాయి.
News November 16, 2025
తిరుమలలో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారా?

స్వామివారి పుష్కరిణికి వాయువ్యంలో ఉన్న వరాహస్వామి ఆలయాన్ని తప్పక దర్శించుకోవాలి. పురాణాల ప్రకారం.. విష్ణుమూర్తి వరాహావతారంలో భూమిని పైకెత్తారు. ఆయన అనుమతితోనే శ్రీనివాసుడు తిరుమలలో వెలిశారు. అందుకే, తిరుమలలో తనను దర్శించుకునే భక్తులందరూ ముందుగా భూవరాహస్వామిని దర్శించుకుంటారని శ్రీనివాసుడు చెప్పారు. ఇప్పటికీ శ్రీవారి దర్శనానికన్నా ముందు దర్శనం, నైవేద్యం వరాహస్వామికే సమర్పిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>


