News January 29, 2025

అన్నమయ్య జిల్లా డీఈవోను సస్పెండ్ చేయాలి: సీపీఎం

image

కస్తూరిబా గురుకుల పాఠశాలలో విద్యార్థుల చేత వెట్టి చాకరీ చేపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, గురుకుల పాఠశాలను గాలికి వదిలేసిన అన్నమయ్య జిల్లా డీఈవో, జీసీడీవోలను సస్పెండ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావుకు వినతిపత్రం అందచేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News February 19, 2025

ADB: అప్పుల బాధతో రైతు సూసైడ్

image

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పార్టీ(కే) గ్రామానికి చెందిన బోడగిరి రాజు(40) తన 3 ఎకరాల భూమితో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. అనుకున్న మేర పంట దిగుబడి రాలేదు. రుణమాఫీ కూడా కాకపోవడంతో అప్పు ఎట్లా తీర్చాలో అని మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

News February 19, 2025

ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మకే టీడీపీ మద్దతు: ఎంపీ

image

కష్టకాలంలో నిలబడ్డవారికి సపోర్ట్ చేయాలని విశాఖ MP శ్రీభరత్ అన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆదేశానుసారం ప్రస్తుత MLC రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. జనసేన కూడా మద్దతు తెలిపిందని.. బీజేపీతో చర్చిస్తామని వెల్లడించారు. కాగా.. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల సమయంలో TDP బలపరిచిన వేపాడ చిరంజీవి గెలుపులో రఘువర్మ కీలక పాత్ర పోషించారు.

News February 19, 2025

పరిగి: కరెంట్‌ పోల్‌‌కు ఉరేసుకొని సూసైడ్

image

పరిగిలో విషాదం ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. నజీరాబాద్ తండాకు చెందిన భారతి పరిగి మండలం హనుమాన్ గండి సమీపంలో ఉన్న కరెంట్ పోల్‌కు ఉరేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

error: Content is protected !!