News January 25, 2025

అన్నమయ్య జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండండి

image

జంప్ డిపాజిట్ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా పోలీసులు సూచించారు. ‘మీకు తెలియని వ్యక్తుల నుంచి గూగుల్ పే, ఫోన్‌పేకు కొంత డబ్బు వచ్చిందని సైబర్ నేరగాళ్లు మీకు మెసేజ్ పంపిస్తారు. మనం ఆ డబ్బు నిజంగా వచ్చిందేమో అనుకొని టచ్ చేసి తిరిగి పంపించామో, మనం మోసపోయినట్టే. అమౌంట్ వచ్చినట్లు మీకు కనపడితే వెంటనే తప్పుడు పిన్‌ను ఎంటర్ చేయండి. ఇలా చేస్తే మోసపోరు’ అని సూచించారు.

Similar News

News November 5, 2025

అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ జిల్లాలో రెండు సబ్ స్టేషన్లు ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి
➤ భక్తిశ్రద్ధలతో కార్తీక నోములు
➤ మంగవరంలో ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
➤ విజయరామరాజుపేట తాచేరు వంతెనపై రవాణా పునరుద్ధరణ
➤ రాజీనామా చేసిన వైసీపీ నేతకు బుజ్జగింపులు
➤ అనకాపల్లిలో పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన
➤ గర్నికం వద్ద కోళ్ల ఫారం తొలగించాలని గ్రామస్థుల ధర్నా
➤ ఆలయాల వద్ద పోలీసులు, అధికారుల పహారా

News November 5, 2025

జూబ్లీ సర్వేల వెనుక కేటీఆర్ కుట్ర: చనగాని దయాకర్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కేటీఆర్ వెనుక ఉండి చేయిస్తున్న ఫేక్ సర్వేలతో ప్రజల అభిప్రాయం మారదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడుతూ.. ఫేక్ సర్వేలు పూర్తి ప్రజా అభిప్రాయం కాదన్నారు. సర్వేల వెనుక కేటీఆర్ కుట్ర ముమ్మాటికి ఉందని అందుకే సర్వేల ఆర్టిస్టులు బయటకు వచ్చారన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ముమ్మాటికి అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు.

News November 5, 2025

ప్రతాపసింగారం: పంచవృక్షాల మహిమాన్వితం.. శైవక్షేత్రం

image

మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారంలోని శివాలయం విశిష్టతతో భక్తుల మనసును ఆకట్టుకుంటోంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ దేవాలయంలో రావి, మారేడు, వేప, ఉసిరి, జమ్మి పంచవృక్షాలు ఒకేస్థలంలో పెరిగాయి. ఈ 5 వృక్షాలు సాక్షాత్ దైవతత్త్వాన్ని ధారపోస్తూ ఆ ప్రదేశాన్ని పవిత్ర శక్తిక్షేత్రంగా మార్చేశాయి. ఆధ్యాత్మిక తేజస్సు విరజిమ్మే ఈ ప్రాంగణంలో కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే శుభఫలాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.