News January 25, 2025

అన్నమయ్య జిల్లా రయితకు రాజభవన్ పిలుపు

image

రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని ‘రాజభవన్’లో ఎట్ హోమ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ రచయిత, రాష్ట్ర అధికార భాషా సంఘ మాజీ సభ్యులు అబ్దుల్ ఖాదర్‌కు ఆహ్వానం అందిదంది. కలికిరి తహసీల్దార్ మహేశ్వరీబాయి ఆయనకు ఆహ్వానపత్రాన్ని అందించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు అబ్దుల్ ఖాదర్‌కు ఈ గౌరవం దక్కింది.

Similar News

News December 4, 2025

అమరావతిలో భూసమీకరణపై ప్రశ్నలు!

image

AP: రాజధాని అమరావతిలో భూసమీకరణపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో సేకరించిన 32వేల ఎకరాల్లో పనులు ఓ కొలిక్కి రాకముందే రెండో విడతలో 16వేల ఎకరాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మూడో విడత భూసేకరణ కోసం కసరత్తు చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గన్నవరంలో విమానాశ్రయం ఉండగా అమరావతిలో మరో ఎయిర్‌పోర్ట్ ఎందుకని అంటున్నారు. దీనిపై మీ COMMENT?

News December 4, 2025

జీవీఎంసీలో విలీనం కానున్న గ్రామీణ మండలాలివే..!

image

ఉమ్మడి విశాఖ జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన 4 మండలాలైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తిని GVMCలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 3 గ్రామీణ మండలాలు (భీమిలి, పద్మనాభం, ఆనందపురం) GVMCలో కలిపేందుకు CM చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. దీంతో GVMC పరిధి విస్తరణతో పాటు వార్డులు కూడా పెరగనున్నాయి.

News December 4, 2025

ఏయే పూజలకు ఏ సమయం అనుకూలం?

image

పౌర్ణమి తిథి నేడు ఉదయం 8.37AMకి ప్రారంభమై, రేపు తెల్లవారుజామున 4.43AMకి ముగుస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజు చేసే ఏ పూజలైనా, వ్రతాలైనా ఈ సమయంలో చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. నేడు ఉదయం 6.59AM – 2.54PM మధ్యలో రవి యోగం ఉంటుందని, ఈ సమయంలో పవిత్ర స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని అంటున్నారు. లక్ష్మీ, సత్యనారాయణ వ్రతాలతో పాటు శివాభిషేకం, ఇతర పూజలు ప్రదోష కాలంలో చేయాలంటున్నారు.