News January 26, 2025
అన్నమయ్య జిల్లా రయితకు రాజభవన్ పిలుపు

రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని ‘రాజభవన్’లో ఎట్ హోమ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ రచయిత, రాష్ట్ర అధికార భాషా సంఘ మాజీ సభ్యులు అబ్దుల్ ఖాదర్కు ఆహ్వానం అందిదంది. కలికిరి తహసీల్దార్ మహేశ్వరీబాయి ఆయనకు ఆహ్వానపత్రాన్ని అందించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు అబ్దుల్ ఖాదర్కు ఈ గౌరవం దక్కింది.
Similar News
News December 13, 2025
BREAKING: పెద్దపల్లి: ఘోర రోడ్డు ప్రమాదం

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరినాట్లు వేసేందుకు మహారాష్ట్ర నుంచి సుల్తానాబాద్కు వస్తున్న వలస కూలీలు ప్రయాణిస్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
News December 13, 2025
22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

TG స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీజీ సెట్) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. టీజీ సెట్ను 45వేల మంది అభ్యర్థులు రాయనుండగా 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షలు 2 షిఫ్టుల్లో జరగనున్నాయి.
News December 13, 2025
BHPL: ఎన్నికల ఖర్చులు.. లెక్క చెప్పాల్సిందే!

జిల్లాలో 248 గ్రామ పంచాయతీలు, 2,102 వార్డులు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓడిన గెలిచిన ప్రచారం కోసం పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు లెక్క ఎన్నికల కమిషన్కు చెప్పాలి. ఏ విడత ఎన్నిక అయినా నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ ముగిసిన రోజు వరకు సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల్లో ప్రతి ఒక్క అభ్యర్థి ఎన్నికల కోసం నిర్వహించిన లావాదేవీలు నమోదు చేయాల్సిందే.


