News March 20, 2025

అన్నమయ్య జిల్లా సైబర్ క్రైమ్ సీఐగా మహమ్మద్ అలీ

image

అన్నమయ్య జిల్లా సైబర్ క్రైమ్ నూతన సీఐగా బుధవారం ఎస్. మహమ్మద్ అలీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎస్పీ నూతన ఇన్స్పెక్టర్‌కి సూచనలు చేశారు. సైబర్ నేరాలు చాలా వేగంగా పెరుగుతున్నాయని, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా నేరాలు, డేటా చోరీలు వంటివాటిపై సీఐ నిఘా పెంచి కేసులు ఛేదించాలని చెప్పారు.

Similar News

News April 17, 2025

ALERT: కాసేపట్లో భారీ వర్షం

image

తెలంగాణలోని కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాత్రి 7 గంటల లోపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. అటు మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన మోస్తరు వాన పడుతుందని ఇప్పటికే అంచనా వేసింది. ప్రజలు ఎత్తైన ప్రదేశాలు, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. కాగా ఆదిలాబాద్‌ జిల్లాలో సాయంత్రం వడగళ్ల వాన కురిసింది.

News April 17, 2025

గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

image

TG: గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకూ గ్రూప్-1 నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది.

News April 17, 2025

నర్సంపేట: వ్యభిచార గృహంపై దాడులు

image

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. గురువారం పక్కా సమాచారం మేరకు ఒకరి ఇంట్లో దాడులు చేయగా.. పట్టణానికి చెందిన ఓ మహిళ, బాంజిపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను వ్యభిచార కూపం నుంచి రక్షించినట్లు సీఐ రమణమూర్తి తెలిపారు.

error: Content is protected !!