News February 25, 2025

అన్నమయ్య జిల్లా TODAY TOP NEWS

image

➢ ఓబుళవారిపల్లె: ఏనుగుల దాడిలో ముగ్గురి మృతి
➢ మదనపల్లె: నడిరోడ్డుపై కొట్టుకున్న యువకులు
➢ ఏనుగుల దాడిలో మరణించిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా
➢ మదనపల్లెలో షటిల్ ఆడుతూ వ్యక్తి మృతి
➢ రాష్ట్రాన్ని జగన్ దివాలా తీశాడు: షాజహాన్ బాషా
➢ గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలు నిలిపివేత
➢ అన్నమయ్య జిల్లా ఘటనపై అసెంబ్లీలో మాట్లాడిన పవన్
➢ రామసముద్రం: రేపు శివాలయాల్లో ఉత్సవాలు నిలిపివేత

Similar News

News November 24, 2025

జిల్లా పోలీస్ కార్యాలయానికి 62 ఆర్జీలు: SP

image

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 62 ఆర్జీలు వచ్చినట్లు SP ఉమామహేశ్వర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నేరుగా ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించి నివేదిక అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు.

News November 24, 2025

మల్యాల: ‘రెండోసారి అధికారంలోకి వచ్చాక మహిళలందరికీ పట్టుచీరలు’

image

రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలందరికీ పట్టుచీరలు అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. ఇవాళ సాయంత్రం మల్యాలలో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్ప చేసిందని ఆరోపించారు.

News November 24, 2025

పుట్టపర్తిలో ఉత్సవాలు బ్లాక్‌బస్టర్!

image

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.