News February 25, 2025

అన్నమయ్య జిల్లా TODAY TOP NEWS

image

➢ ఓబుళవారిపల్లె: ఏనుగుల దాడిలో ముగ్గురి మృతి
➢ మదనపల్లె: నడిరోడ్డుపై కొట్టుకున్న యువకులు
➢ ఏనుగుల దాడిలో మరణించిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా
➢ మదనపల్లెలో షటిల్ ఆడుతూ వ్యక్తి మృతి
➢ రాష్ట్రాన్ని జగన్ దివాలా తీశాడు: షాజహాన్ బాషా
➢ గుండాల కోనలో శివరాత్రి ఉత్సవాలు నిలిపివేత
➢ అన్నమయ్య జిల్లా ఘటనపై అసెంబ్లీలో మాట్లాడిన పవన్
➢ రామసముద్రం: రేపు శివాలయాల్లో ఉత్సవాలు నిలిపివేత

Similar News

News October 15, 2025

అక్టోబర్ 30న శ్రీవారి పుష్పయాగం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనికి ముందు రోజు అంకురార్పణ జరుగుతుంది. పుష్పయాగం రోజున ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం వంటి ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్న వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం చేస్తారు. సాయంత్రం స్వామివారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారు.

News October 15, 2025

సంక్రాంతికి కోనసీమ బీచ్ ఫెస్టివల్: కలెక్టర్

image

అక్టోబరు 15 కోనసీమ బీచ్ ఫెస్టివల్‌ను సంక్రాంతికి అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు. కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలు, హోం స్టే విధానాల ప్రదర్శన ప్రధానంగా ఉంటుందని తెలిపారు. బుధవారం ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం నందు ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఫెస్టివల్ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఫెస్టివల్ నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.

News October 15, 2025

తహశీల్దార్ ఫిర్యాదు FIR కాలేదు ఎందుకో.?

image

తనపై దౌర్జన్యం జరిగిందని లింగసముద్రం తహశీల్దార్ స్వయంగా ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు అదేరోజు FIR ఎందుకు చేయలేదన్న విమర్శలు చెలరేగుతున్నాయి. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారి ఫిర్యాదు ఇస్తే అది కూడా FIR కాకపోవడం చర్చనీయాంశమైంది. లింగసముద్రం SI నారాయణ తీరు పట్ల తహశీల్దార్ సైతం అసహనం వ్యక్తం చేశారు. బాధితుల పట్ల పోలీసులు బాధ్యతగా వ్యవహరించకపోతే ఎలా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.