News April 7, 2025

అన్నమయ్య: డిప్యూటీ కలెక్టర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం

image

సంబేపల్లె మండలం, యర్రగుంట్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమాదేవి మృతిచెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు నారా చంద్రబాబునాయుడు సూచించారు.

Similar News

News December 17, 2025

వికారాబాద్ జిల్లాలో 78.79 శాతం పోలింగ్

image

VKB జిల్లాలో మూడో విడత ఎన్నికల్లో భాగంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన పోలింగ్‌లో 78.79 శాతం పోలింగ్ నమోదయినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లాలోని పూడూర్, పరిగి దోమ, కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి అభ్యర్థుల గెలుపును ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.

News December 17, 2025

ఖమ్మం: ముగిసిన మూడో విడత.. 86.65% ఓటింగ్

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 86.65 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. పోలింగ్ ముగియడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి ఫలితాలను వెల్లడించనున్నారు.

News December 17, 2025

ఇబ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలు: నిర్మల్ ఎస్పీ

image

చివరి దశ పంచాయతీ ఎన్నికల్లో ఐదు మండలాల్లో ఇబ్బందులు కలిగించి ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి షర్మిల స్పష్టం చేశారు. బుధవారం ముధోల్, బాసర, తానూరు తదితర పోలింగ్ కేంద్రాలకు సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సిబ్బంది, భద్రత సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించారన్నారు.