News February 8, 2025

అన్నమయ్య: తండ్రి, కూతురు మృతి UPDATE

image

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాద మృతుల వివరాలు లభించినట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు. మృతులు మదనపల్లి ప్రశాంత్ నగర్‌కు చెందిన భవన కార్మికుడు సోమశేఖర్(35), కుమార్తె సిద్దేశ్వరి(03)గా గుర్తించామన్నారు. కదిరిలో పెదనాన్న అంత్యక్రియలకు బైకులో వెళుతుండగా.. ములకలచెరువు వద్ద ఐచర్ వాహనం ఢీకొట్టి తండ్రి, కుమార్తె చనిపోగా.. భార్య కవిత (25), కొడుకు రెడ్డి శేఖర్(05)ని రుయాకు తరలించారు.

Similar News

News April 17, 2026

TG కాంగ్రెస్‌ను తలపించేలా విజయ్ మ్యానిఫెస్టో!

image

TN అసెంబ్లీ ఎన్నికల వేళ నిన్న TVK చీఫ్ విజయ్ ప్రకటించిన <<19667137>>మ్యానిఫెస్టో<<>> TGలో కాంగ్రెస్ పార్టీ హామీలను తలపిస్తోంది. నెలకు 200యూనిట్ల ఉచిత కరెంట్ పథకాన్ని విజయ్ కూడా ప్రకటించారు. పెళ్లైన యువతులకు INC తులం బంగారం ఇస్తామనగా TVK చీఫ్ 8గ్రా. హామీ ఇచ్చారు. రేవంత్ రూ.500కే సిలిండర్ హామీ ఇవ్వగా విజయ్ ఏడాదికి 6 ఫ్రీగా ఇస్తామన్నారు. TG మాదిరే రైతు రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2,500 వంటి హామీలను విజయ్ గుప్పించారు.

News April 17, 2026

ఎచ్చెర్ల: చేపల వేటకు బ్రేక్.. తీరాల్లో నిశ్శబ్దం!

image

చేపల వేటపై రెండు నెలల నిషేధం అమల్లోకి రావడంతో జిల్లాలోని సముద్ర తీరాలు నిర్మానుష్యంగా మారాయి. ఎచెర్ల మండలంలోని డి.మత్స్యలేశం గ్రామంలో మత్స్యకారులు బోట్లను, వలలను ఒడ్డున సురక్షితంగా ఉంచి ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతి ఏడాది చేపల ప్రత్యుత్పత్తి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

News April 17, 2026

భీమిలి-విశాఖ బీచ్ రోడ్డులో కారు బీభత్సం

image

భీమిలి-విశాఖ బీచ్ రోడ్డులోని మంగవారిపేట జంక్షన్ వద్ద గురువారం ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. నగర పర్యాటనకు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఈ ఘటనలో గాయపడ్డారు. సీసీ కెమెరా స్తంభాన్ని కూడా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బీచ్ పెట్రోలింగ్ పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు.