News March 1, 2025

అన్నమయ్య: ‘నాటు సారా నిర్మూలనకు కృషి చేయాలి’

image

అన్నమయ్య జిల్లా చినమడియం మండలంలోని గిరిజన ప్రాంతాల్లో నాటుసారా నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఎక్చేంజ్ ఎస్పీ మధుసూధన్ పేర్కొన్నారు. శుక్రవారం ముసలికుంట రెవెన్యూ గ్రామ పరిధిలోని బండక్రింద తాండాలో నాటుసారా నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్చేంజ్ ఎస్పీ మధుసూధన్ మాట్లడుతూ.. ప్రభుత్వం గిరిజనులకు ఉపాధి కల్పించి, అన్నివిధాల ఆదుకుంటుదని హామీ ఇచ్చారు.

Similar News

News December 30, 2025

కొండగట్టులో కలెక్టర్ దంపతుల ప్రత్యేక పూజలు

image

ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ దంపతులు మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజల శ్రేయస్సు, సుఖసంతోషాలు, శాంతి భద్రతలు, సమగ్ర అభివృద్ధి కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు కలెక్టర్ తెలిపారు.

News December 30, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>), నవీ ముంబైలో 4 డిప్యూటీ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.472. పే స్కేల్ రూ.40,000 నుంచి రూ.1,40,000వరకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News December 30, 2025

పసిడి సామ్రాజ్యం.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్న ఇండియన్స్!

image

భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు. ఒక గొప్ప సెంటిమెంట్. ప్రస్తుతం అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో భారతీయుల వద్ద ఉన్న 34,600 టన్నుల బంగారం విలువ $5 ట్రిలియన్లకు (₹420 లక్షల కోట్లు) చేరిందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. విశేషమేమిటంటే ఈ సంపద మన దేశ మొత్తం GDP ($4.1 ట్రిలియన్లు) కంటే కూడా ఎక్కువ. ఈ భారీ ‘గోల్డ్ పవర్’ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే హాట్ టాపిక్‌గా మారింది.