News March 1, 2025

అన్నమయ్య: ‘నాటు సారా నిర్మూలనకు కృషి చేయాలి’

image

అన్నమయ్య జిల్లా చినమడియం మండలంలోని గిరిజన ప్రాంతాల్లో నాటుసారా నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఎక్చేంజ్ ఎస్పీ మధుసూధన్ పేర్కొన్నారు. శుక్రవారం ముసలికుంట రెవెన్యూ గ్రామ పరిధిలోని బండక్రింద తాండాలో నాటుసారా నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్చేంజ్ ఎస్పీ మధుసూధన్ మాట్లడుతూ.. ప్రభుత్వం గిరిజనులకు ఉపాధి కల్పించి, అన్నివిధాల ఆదుకుంటుదని హామీ ఇచ్చారు.

Similar News

News December 10, 2025

భవానీ దీక్ష పరులు ఇరుముడి సమర్పించేది ఎక్కడంటే.!

image

భవానీ భక్తుల సౌకర్యార్థం 3 హోమ గుండాలు ఏర్పాటు చేశారు. కొండ కింద నూతన ప్రసాదాల తయారీ భవనం ఎదురుగా 2, గోశాల పక్కన ఒకటి ఏర్పాటు చేసిన వాటిని 11న ప్రారంభిస్తారు. భక్తులు ఇరుముడి సమర్పించేందుకు 110స్టాండ్లతో కూడిన పాయింట్లను నూతన అన్నదాన భవన ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. 300మంది గురు భవానీలు షిఫ్టుల వారీగా పనిచేస్తారు. కొండ దిగువన, పైభాగంలో తాత్కాలిక క్యూమార్గాల్లో వాటర్‌ ప్రూఫ్‌ షామియానా ఏర్పాటు చేశారు.

News December 10, 2025

పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: నల్గొండ ఎస్పీ

image

మొదటి విడత పోలింగ్ జరగనున్న కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. బుధవారం పోలీస్ సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని సూచించారు. ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.

News December 10, 2025

నల్గొండ: ‘తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి’

image

నల్గొండ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మొత్తం 14 మండలాల్లోని 318 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించేందుకు 7,000 మంది సిబ్బంది నియమించగా, 5,600 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి మండలానికి డీఆర్సీ కేంద్రాలు, రూట్, జోనల్ అధికారులు నియమించారు. పోలింగ్ సిబ్బందికి వసతి, భోజనం, కిట్‌లతో సహా అన్ని సౌకర్యాలు కల్పించారు.