News March 1, 2025

అన్నమయ్య: ‘నాటు సారా నిర్మూలనకు కృషి చేయాలి’

image

అన్నమయ్య జిల్లా చినమడియం మండలంలోని గిరిజన ప్రాంతాల్లో నాటుసారా నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఎక్చేంజ్ ఎస్పీ మధుసూధన్ పేర్కొన్నారు. శుక్రవారం ముసలికుంట రెవెన్యూ గ్రామ పరిధిలోని బండక్రింద తాండాలో నాటుసారా నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్చేంజ్ ఎస్పీ మధుసూధన్ మాట్లడుతూ.. ప్రభుత్వం గిరిజనులకు ఉపాధి కల్పించి, అన్నివిధాల ఆదుకుంటుదని హామీ ఇచ్చారు.

Similar News

News December 15, 2025

IPL మినీ ఆక్షన్‌‌లో కొత్త రూల్

image

IPL మినీ ఆక్షన్‌లో ఓవర్సీస్ ప్లేయర్ల హైయెస్ట్ ప్రైస్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ₹18Crగా నిర్ణయించింది. ఒకవేళ వేలంలో సదరు ప్లేయర్ అంతకంటే ఎక్కువ ధర పలికినా అతడికి ₹18కోట్లే చెల్లిస్తారు. దానిపై మిగిలిన మొత్తం BCCIకి వెళ్తుంది. ఆ డబ్బును ప్లేయర్ల వెల్ఫేర్ కోసం ఉపయోగిస్తారు. కాగా IPL-2026 మినీ వేలం రేపు అబుదాబిలో మ.2.30 గంటల నుంచి జరగనుంది. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.

News December 15, 2025

3 సార్లు ‘ఓట్ చోరీ’ చేశారు.. రాహుల్‌కు BJP కౌంటర్

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ‘ఎక్కువ మద్దతు ఉన్న సర్దార్ పటేల్‌ స్థానంలో నెహ్రూ ప్రధాని అయినప్పుడు ఓట్ చోరీ జరిగింది. కోర్టు తీర్పు తర్వాత కూడా ఇందిరా గాంధీ ఎన్నికవడం వివాదాస్పద అధ్యాయంగా చరిత్రలో నిలిచిపోయింది. సోనియా గాంధీ భారత పౌరసత్వం లేకుండానే ఓటరు అయ్యారు’ అని ట్వీట్ చేసింది. రాహుల్ ఫేక్ ప్రాపగండాను తాము క్లీన్ చేస్తున్నామని మండిపడింది.

News December 15, 2025

హుజూరాబాద్: 5 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: CP

image

​KNR పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 17న మూడో దశ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు CP గౌష్ ఆలం తెలిపారు. 144 సెక్షన్ 48 గంటల పాటు వీణవంక , ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, వి.సైదాపూర్ మండలాల పరిధిలో అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం లేదా సమావేశం కావడాన్ని పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు.