News March 16, 2025

అన్నమయ్య: పకడ్బందీగా పరీక్షల నిర్వహణ

image

మార్చి 17నుంచి ప్రారంభమయ్యే ఎస్ఎస్సీ, ఓపెన్ స్కూల్ పరీక్షల సందర్భంగా జిల్లాలో పకడ్బంది ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యాశాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.

Similar News

News April 10, 2026

నన్నయ్య యూనివర్సిటీ స్నాతకోత్సవాలకు ఎమ్మెల్యే బత్తుల

image

రాజానగరంలో శ్రీ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 16, 17వ స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ గవర్నర్‌కు దుశ్శాలువతో సత్కరించి స్వాగతం పలికారు. కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ఆర్డీవో, తదితరులు పాల్గొన్నారు.

News April 10, 2026

జనగామ నేతలతో TPCC చీఫ్ సమావేశం

image

గాంధీభవన్‌లో జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలతో TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల కమిటీల నియామక ప్రక్రియ, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు మహేశ్ కుమార్ గౌడ్ దిశ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ నేతలు పాల్గొన్నారు.

News April 10, 2026

50 మిలియన్ యూనిట్ల వినియోగం పెరిగింది: HNK ఎస్ఈ

image

గడిచిన త్రైమాసికంలో జిల్లాలో సుమారు 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. గృహ, వాణిజ్య, పరిశ్రమల కేటగిరీలు కలిపి జిల్లాలో మిలియన్ యూనిట్ల వారిగా జనవరి మాసంలో 139.120, ఫిబ్రవరిలో 147.860, మార్చిలో 189.050 రికార్డు నమోదయింది. వేసవిలో వినియోగదారుల డిమాండ్ మేరకు ఎలాంటి అంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్ఈ మధుసూదన్ రావు తెలిపారు.