News January 30, 2025

అన్నమయ్య: ‘పింఛన్ల పంపిణీ వందశాతం పూర్తి చేయాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1న అన్నమయ్య జిల్లాలో 100% సామాజిక పింఛన్ల పంపిణీని సజావుగా పూర్తి చేయాలని, జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నందలి మినీ హాలు నుంచి అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఫిబ్రవరి 1న 100% పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News December 1, 2025

అనకాపల్లి: తుఫాను భయం.. రైతులకు సూచనలివే

image

దిత్వా తుఫాన్ నేపథ్యంలో రైతులు వరికోతలను రెండుమూడు రోజులు వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి విజ్ఞప్తి చేశారు. పరిస్థితిలు అనుకూలించిన తర్వాత మాత్రమే కోతలు ప్రారంభించాలన్నారు. కోసిన వరి పనలు తడిస్తే నూర్చి ఎండలో ఎండ పెట్టాలన్నారు. ప్రతి క్వింటాల్ ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల ఊకపొడి కలపాలన్నారు. మొలకలు రాకుండా ఉండేందుకు ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయాలన్నారు.

News December 1, 2025

చీడికాడ: గంజాయి కేసులో నలుగురికి 10 ఏళ్లు జైలు శిక్ష

image

చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో నమోదైన గంజాయి కేసులో నలుగురు నిందితులకు 10ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు, ఒక్కొక్కరికీ రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం.హరినారాయణ తీర్పు చెప్పినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. సోమవారం సాయంత్రం ఆయన వివరాలు వెల్లడించారు. ధరావత్ రవి, మడ్డు నర్సింహరాజు, దాలిబోయిన ఫల్గుణ, బండారు సంతోష్‌లకు ఈ శిక్ష పడినట్లు చెప్పారు.

News December 1, 2025

కృష్ణా: తుఫాన్ ప్రభావంతో అపరాల సాగు ఆలస్యమే.!

image

దిత్వా తుఫాన్ ప్రభావం కృష్ణా డెల్టా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సాధారణంగా వరి కోత అనంతరం రెండో పంటగా సాగుచేసే అపరాల సాగుకు నవంబర్ నెలలోనే పనులు ప్రారంభమవుతాయి. అయితే తుఫాన్ నేపథ్యంతో వరికోతలు నిలిచిపోవడంతో, అపరాల సాగు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. రెండో పంట ఆలస్యమవ్వడంతో దిగుబడి కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.